పేరు మార్పు హేయం: ప్రతిభా భారతి

విజయవాడలో హెల్త్‌ వర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపిస్తే.. చంద్రబాబు దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి స్పష్టం చేశారు. వారిద్దరి కృషితో

Published : 25 Sep 2022 05:41 IST

ఈనాడు, అమరావతి: విజయవాడలో హెల్త్‌ వర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపిస్తే.. చంద్రబాబు దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టారని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి స్పష్టం చేశారు. వారిద్దరి కృషితో అభివృద్ధి చెందిన ఈ విశ్వవిద్యాలయం వైఎస్సార్‌, జగన్‌లు తెచ్చింది కాదని మండిపడ్డారు. ఎన్టీఆర్‌లాంటి మహాత్ముడి పేరు మార్చడం హేయమని శనివారం వీడియో ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘జగన్‌ లాంటి తుగ్లక్‌ పాలకుడిని గతంలో ఎప్పుడూ చూడలేదు. పేరు మార్పు నిర్ణయం ప్రపంచంలోని తెలుగు వారందరినీ అవమానపరచడమే. జగన్‌ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని