పొత్తులుంటే నిర్భయంగా చెబుతాం: నాదెండ్ల మనోహర్‌

‘జనసేన పార్టీ పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యమిస్తుంది. ఏ పార్టీతోనైనా పొత్తుంటే ధైర్యంగా చెప్పే దమ్ము పవన్‌కల్యాణ్‌కు ఉంది’ అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Published : 26 Nov 2022 04:56 IST

ఈనాడు, విజయనగరం: ‘జనసేన పార్టీ పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యమిస్తుంది. ఏ పార్టీతోనైనా పొత్తుంటే ధైర్యంగా చెప్పే దమ్ము పవన్‌కల్యాణ్‌కు ఉంది’ అని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కొన్ని పార్టీలు కావాలనే విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విజయనగరం జిల్లా గంట్యాడలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఎదుగుతోందని, దీంతో రెండు పార్టీలకు భయం పట్టుకుందన్నారు. ఉత్తరాంధ్రపై వైకాపా నేతల కపట ప్రేమను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని