Chandrababu Arrest: ‘మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నా’: ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి
తెదేపా అధినేత చంద్రబాబుకు మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నానని ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్లలో సంఘీవ ర్యాలీ నిర్వహించారు.
రాజమహేంద్రవరం: తెదేపా అధినేత చంద్రబాబుకు మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నానని ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు కార్లలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అడ్డంకులు ఛేదించుకుని రాజమహేంద్రవరం చేరుకున్న వారంతా నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ‘‘ చంద్రబాబు అరెస్టు అక్రమం. ఒక విజనరీ లీడర్ను జైలులో పెట్టడం చాలా బాధకలిగిస్తోంది. హైదరాబాద్లో ఐటీ రంగ ఉన్నతికి ఎంతో కృషి చేశారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్టు కక్షపూరిత చర్య. ఆయన అరెస్టును జీర్ణించుకోలేకపోతున్నాం’’ అని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..
హైదరాబాద్లో పనిచేస్తున్న తాము రాజమహేంద్రవరం వస్తుంటే ఏపీ పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని బ్రాహ్మణికి వివరించారు. తెలిపారు. సొంత రాష్ట్రానికి వస్తుంటే అడ్డంకులు, కేసులు పెడతామని బెదిరింపులు ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫోన్లు కూడా పోలీసులు తీసుకున్నారని, వాట్సాప్ చాటింగ్లు కూడా చెక్ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరంలో హోటల్ రూమ్లో ఉంటే పోలీసులు వచ్చి గదిలో పెట్టి తాళం వేశారని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల క్రితం రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతం నేడు ఈ స్థాయిలో అభివృద్ది చెంది లక్షల మందికి ఉపాధినిచ్చే కేంద్రంగా మారడం వెనుక చంద్రబాబు కృషిని ఎవరూ చెరిపివేయలేరని ఉద్యోగులు నారా బ్రాహ్మణితో అన్నారు.
ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు దారుణం: బ్రాహ్మణి
చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణమని నారా బ్రాహ్మణి అన్నారు. వాహనదారుల ఫోన్లు చెక్ చేయడం, చాట్లు పరిశీలించడం షాక్కు గురి చేసిందన్నారు. పోలీసుల చర్యల ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమేనన్నారు. సామాన్య ప్రజల ఫోన్లు చెక్ చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏ కారణంతో ఉద్యోగుల రాకపై ఆంక్షలు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా?. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలకోర్చి, ప్రభుత్వ నిర్బంధాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి గర్వపడుతున్నా. వారికి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు ఈ కష్ట సమయాన్ని అధిగమిస్తారు. సంక్షోభాలను అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన నాయకుడు. యువత అందరూ ఓట్లు చెక్ చేసుకోవాలి. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలి. ఆన్ లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు, అక్రమంగా ఎవరూ తమ ఓట్లు తొలగించకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత తీసుకోవాలి’’ అని తనను కలిసిన ఉద్యోగులను బ్రాహ్మణి కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
ఎమ్మెల్సీలుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. -
Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. స్పీకర్ ఎన్నిక అప్పుడే
తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ఈ నెల 14కు వాయిదా పడ్డాయి. -
Nara Lokesh: ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకూ నిధులు ఇవ్వట్లేదు: నారా లోకేశ్
సీఎం జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. -
ChandraBabu: గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు: చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు తెదేపా(TDP) అవసరం ఎంతో ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఆయన భేటీ అయ్యారు. -
Telangana Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. తొలుత సీఎం, తర్వాత మంత్రులు
తెలంగాణ అసెంబ్లీ (Telangana Legislative Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయిస్తున్నారు. -
Kishan Reddy: లోపాయికారి ఒప్పందం ప్రకారమే మజ్లిస్ ప్రొటెం స్పీకర్: కిషన్రెడ్డి
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. -
Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్ను కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ (Congress) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
భారాస (BRS) శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ను ఎన్నుకున్నారు. -
TS News: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు
రాష్ట్ర మంత్రులకు శాఖలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేటాయించారు. -
Kishan Reddy: భాజపా ఎమ్మెల్యేలతో కిషన్రెడ్డి భేటీ
నూతనంగా ఎన్నికైన భాజపా శాసనసభ్యులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను కిషన్రెడ్డి సన్మానించారు. -
Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ తమిళిసై.. అక్బరుద్దీన్ (Akbar Uddin Owaisi)తో ప్రమాణం చేయించారు. -
రోడ్డు దిగని జగన్.. పొలం గట్టున బాబు
తుపానుకు దెబ్బతిన్న పంటల పరిశీలన సందర్భమది.. శుక్రవారం పట్టపగలు సీఎం వైఎస్ జగన్ వచ్చారు. చుట్టూ బారికేడ్లు, పొలం పక్కనున్న రోడ్డు మీద ఎత్తయిన వేదిక.. ఎండ పడకుండా టెంట్లు.. కనీసం రోడ్డు దిగకుండా అక్కడి నుంచే ‘పంట నష్టాన్ని’ పరిశీలించి వెళ్లారు. అదే ప్రాంతానికి అదేరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేరుకున్నారు. -
నేటి నుంచి లోకేశ్ పాదయాత్ర పునఃప్రారంభం
తుపాను కారణంగా తాత్కాలికంగా ఆగిన యువగళం పాదయాత్ర శనివారం మళ్లీ ప్రారంభం కానుంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ఈ యాత్ర ఈ నెల 3న కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల ప్రాంతం వద్దకు చేరుకుంది. -
ప్రభుత్వ ఉదాసీనతతో అన్నదాతకు తీవ్రనష్టం
తుపానుపై వైకాపా ప్రభుత్వ ఉదాసీనత వల్లే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల, ఉంగుటూరు మండలం కైకరం, తల్లాపురం గ్రామాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. -
సమన్వయంతో పని చేస్తే అధికారంలోకి..
తెదేపాతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాల్సిన సమయమిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మూడు నెలల్లో ఫలితం అనుభవిస్తారు
ప్రజాసమస్యల్ని గాలికొదిలేసి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ విర్రవీగితే... ఫలితం అనుభవించక తప్పదని జగన్ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటేశాం. -
భయస్థులకు ఎన్నికల్లో పోటీ ఎందుకు?
భయం భయంగా బతుకుతున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడం అవసరమా.. అని సీఎం జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ప్రజలకు కనపడని వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా.. అని నిలదీశారు. -
ఎన్నికలకు ముందు గ్రూప్-2 ప్రకటన వంచన కాదా?: తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల్ని వంచించడమేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు గట్టి షాక్ తగిలింది. డబ్బు, ఖరీదైన బహుమతులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో ఆమెపై లోక్సభ శుక్రవారం బహిష్కరణ వేటు వేసింది. -
తిరుపతికి ‘బ్యాండ్’ వేశారు!
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు. -
మిజోరం సీఎంగా లాల్దుహోమా ప్రమాణం
మిజోరంశాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ (జెడ్పీఎం) అధ్యక్షుడు లాల్దుహోమా శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Allu Aravind: మీ సందేహాలు ఇంకొన్నాళ్లు అలాగే ఉంచండి: అల్లు అరవింద్
-
TS News: ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
-
IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
-
Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
-
BRS: ఎమ్మెల్సీలుగా పల్లా, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా
-
వారి అంకితభావానికి ఆశ్చర్యపోయా.. టాలీవుడ్ ప్రముఖులపై నెట్ఫ్లిక్స్ కో-సీఈవో పోస్టు