ప్రమాణానికి నేను సిద్ధం.. జగన్ సిద్ధమా?: లోకేశ్
విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిప్పికొట్టారు. విజయసాయి
అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిప్పికొట్టారు. విజయసాయి ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పారు. ఘటన వెనుక తనతో పాటు చంద్రబాబు హస్తముందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డితో సీఎం జగన్ దొంగ ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. దీనికి సీఎం జగన్ సిద్ధమా? అని లోకేశ్ సవాల్ విసిరారు. ప్రమాణానికి సింహాచలం అప్పన్న సన్నిధికి వస్తే తేల్చుకుందామన్నారు. ఎన్నాళ్లీ దొంగ ఆరోపణలు చేస్తారని ఆయన నిలదీశారు. జగన్ పార్టీ, హామీలు, పాలన అన్నీ ఫేక్ అని లోకేశ్ దుయ్యబట్టారు. తనపై దొంగల బ్యాచ్తో చేయించే ఆరోపణలు ఫేక్ అనే విషయం పింక్ డైమండ్తోనే తేలిందన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు