Nara Lokesh - Yuvagalam: జగన్ పాలనలో న్యాయవాదులూ బాధితులే: నారా లోకేశ్
న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్.. వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
కడప: న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్.. వాటిలో ఒక్కటీ నెరవేర్చలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జగన్ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులేనని ఆరోపించారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా కడపలో న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వైకాపా పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘సీఎం జగన్ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన ప్రారంభించారు. న్యాయవాదులపైనా దాడులు చేయించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వెంటనే న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. రాజకీయ లబ్ధి కోసమే ప్రాంతాల మధ్య జగన్ చిచ్చుపెట్టారు. తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.
కోర్టుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో నేను స్వయంగా చూశాను. కనీసం కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవు. తెదేపా ప్రభుత్వంలో న్యాయశాఖకు అధిక నిధులు కేటాయించి నూతన భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కొత్త భవనాలు ఏర్పాటు చేస్తాం. న్యాయవాదులకు హెల్త్కార్డులు అందజేస్తాం. ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందిస్తాం. తెదేపా లీగల్ సెల్ను బలోపేతం చేస్తున్నాం.. ఇప్పుడు కష్టపడిన వారికి కచ్చితంగా పదవులు వస్తాయి. నామినేటెడ్ పదవుల్లోనూ న్యాయవాదులకు అవకాశం కల్పిస్తాం. చట్టాన్ని అతిక్రమించి న్యాయవాదులపై కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటాం’’ అని లోకేశ్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM