UP: మాయావతికి ‘రెబల్స్’ షాక్
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు
లఖ్నవూ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను కలిశారు. త్వరలోనే వారు ఎస్పీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలను మాయావతి గతంలోనే పార్టీ నుంచి బహిష్కరించారు.
2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాల్లో గెలుపొందింది. అయితే అప్పటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 11 మందిని మాయావతి బహిష్కరించారు. మరో ఎమ్మెల్యే 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ప్రస్తుతం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలే మిగిలారు. కాగా.. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలపై ఇంకా అనర్హత వేటు పడలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ రెబల్ ఎమ్మెల్యేల్లో 9 మంది నేడు ఎస్సీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏళ్లనాటి వైరాన్ని పక్కనబెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి మహా కూటమిగా పోటీ చేశాయి. అయితే భాజపాలో చేతిలో ఈ కూటమి ఘోర పరాభవం చవిచూసింది. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను వదిలి.. ఎస్సీ, బీఎస్పీ కలిసి పోటీ చేసినా.. ఆశించిన విజయం దక్కలేదు. మరోవైపు 2019 తర్వాత నుంచి బీఎస్పీ నుంచి చాలా మంది నేతలు, కార్యకర్తలు అఖిలేశ్ పార్టీలో చేరారు.
కాగా.. రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకూడదని అఖిలేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ నుంచి చేరికలు ఆయనకు కలిసొచ్చే పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.