
Pawan Kalyan: జగన్ సీబీఐ దత్తపుత్రుడు.. వైకాపా చర్లపల్లి షటిల్ టీమ్: పవన్ కల్యాణ్
అనంతపురం: ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైల్లో కూర్చున్న జగన్, ఆయన బృందం తనకు నీతులు చెప్పడం దారుణమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైకాపా విమర్శలను తిప్పికొట్టారు. ఇంకోసారి తనను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే.. జగన్ను సీబీఐ దత్తపుత్రుడు అంటామని హెచ్చరించారు. అలాగే.. తెలుగుదేశం బీ-టీమ్ అని సంబోధిస్తే వైకాపాను చర్లపల్లి షటిల్ టీమ్ అంటామని తేల్చి చెప్పారు. జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా ఈ మాటలు అనాలని సూచించారు.
‘‘మేం ప్రజల పక్షాన పాలసీలపై మాట్లాడుతుంటే.. వైకాపా అగ్రనాయకత్వం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. వైకాపా సమూహానికి అనంతపురం జిల్లా నుంచి ఒకటే చెప్పదల్చుకున్నా.. నేను విదేశాల్లో చదువుకుని రాలేదు, లండన్ రాయల్ ఫ్యామిలీ కాదు. చీరాల, పేరాల, ప్రకాశం జిల్లాలోని గోపాలనగరం ఇలాంటి చోట పెరిగిన వాడ్ని. మీరు తిట్టే భాషకంటే ఇంకా మంచి భాష నాకూ వచ్చు. కానీ, ఇలాంటి భాష రాజకీయాలకు వాడి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడం నాకిష్టం లేదు. మేం పాలసీలపై మాట్లాడుతున్నప్పుడు మీరు.. సీబీఎన్కు దత్తపుత్రుడు అంటే మేం సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ చెబుతున్నా... ఈసారి వైకాపాకు సంబంధించిన వ్యక్తులు కానీ, నాయకులు కానీ సీబీఎన్ దత్తపుత్రుడు అంటే జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని గట్టిగా చెప్పండి.
వైకాపాలోని ముఖ్య నాయకులు చాలా మందిని సీబీఐ కోర్టు దత్తత తీసుకుంటుంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జనసేనను మీరు తెదేపా బీ టీమ్ అంటున్నారు. ఏదైనా అంటే ఏడుస్తారని భరిస్తూ వచ్చా.. నాక్కూడా సహనం పోయింది. ఈ సారి గనుక మమ్మల్ని తెదేపా బీ టీమ్ అంటే.. మిమ్మల్ని చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది. ఎందుకంటే... చర్లపల్లి జైల్లో చక్కగా 16 నెలలు షటిల్ ఆడుకున్నారు. మీరేదో దేశ సేవ చేయలేదు. వల్లభాయ్ పటేల్ కాదు.. సుభాష్ చంద్రబోస్లు కాదు మీరు.. ఆర్థిక నేరాలు చేసి జైల్లో కూర్చున్నారు. మీరు మాకు నీతులు చెప్పొద్దు. మమ్మల్ని విమర్శించే హక్కు.. ఆ స్థాయి కూడా మీకు లేదు’’ అని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా
-
Politics News
Yanamala: దోచుకున్న ప్రతి రూపాయీ ప్రజలు కక్కిస్తారు: యనమల
-
Business News
Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
-
India News
LPG price: వంటగ్యాస్ మంట.. ఏడాదిలో రూ.244 పెంపు
-
Movies News
Chiranjeevi: చిరు పేరు మార్పు.. న్యూమరాలజీనా? లేదా టీమ్ తప్పిదమా?
-
Sports News
Aravinda de Silva : క్రికెట్ వృద్ధి కోసం.. టీ20 లీగ్లపై భారత్ పట్టు సడలించాలి: లంక మాజీ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు