TDP: ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 13 Nov 2023 14:08 IST

ప్రొద్దుటూరు (నేరవార్తలు): వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల వైకాపా కార్యకర్త బెనర్జీపై దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రవీణ్‌ ప్రమేయం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడ ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడుతుండగా అరెస్ట్‌ చేసేందుకు వచ్చారు. దీంతో ఆయన పోలీసు వాహనం ఎక్కకుండా పీఎస్‌ వరకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. 

మరోవైపు తెదేపా జిల్లా ముఖ్యనేతలు శ్రీనివాసులురెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, నారాయణరెడ్డితో పాటు కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. బెనర్జీపై దాడి ఘటనలో ప్రవీణ్‌కు సంబంధం లేకపోయినా అక్రమంగా కేసు నమోదు చేశారంటూ తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని