Revanth Reddy: పసుపుబోర్డు తెస్తామని.. బోర్డు తిప్పేశారు: రేవంత్రెడ్డి
ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
కోరుట్ల: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని, పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్.. బోర్డు తిప్పేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) రేవంత్ విమర్శించారు. ఆయన చేపట్టిన ‘హాథ్ సే హాత్ జోడో యాత్ర (Hath Se Hath Jodo Yatra) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా కోరుట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? ఈ ప్రాంత పసుపు రైతుల కష్టాలు తీరాయా?’ అని ఆయన ప్రశ్నించారు. ఎకరాకు రూ.1.50లక్షలు పెట్టుబడి పెట్టిన పసుపు రైతులకు ఆత్మహత్యలే దిక్కవుతున్నాయన్నారు. ఆనాడు ఈ ప్రాంతంలో రత్నాకర్రావు చేసిన అభివృద్ధే తప్ప భారాస ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
‘‘ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకొంటున్న కేసీఆర్కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు? అసద్ ఓటేయమని ప్రజలను అడగడం బాగానే ఉంది కానీ, కేసీఆర్ను మోదీ ముందు మోకరిల్లొద్దని ఎందుకు చెప్పడం లేదు. మోదీని వ్యతిరేకిస్తున్న మా వైపు ఎందుకు రావట్లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వండి.’’ అని రేవంత్రెడ్డి ప్రజలను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు