రోడ్డు మరమ్మతులు చేయించేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే.. ధర్మవరంలో ఉద్రిక్తత
సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ధర్మవరం పట్టణం: సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంతలు పడ్డ రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు సామగ్రితో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్అండ్బీ రహదారులు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మతులు చేయాలని గతంలో గోనుగుంట్ల ఫిర్యాదు చేశారు. జనవరి ఆఖరులోగా బాగు చేస్తామని వారు హామీ ఇచ్చారు. గడువులోగా పూడ్చకపోతే తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేయిస్తానని సూర్యనారాయణ చెప్పారు.
ఆ గడువు ముగియడంతో గుంతలు పూడ్చేందుకు యత్నించిన గోనుగుంట్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ సూర్యనారాయణ కార్యకర్తలతో కలసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు మరమ్మతులు ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సూర్యనారాయణను అరెస్టు చేసి ధర్మవరం పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్