Telangana News: కేంద్రం నిధులు గుజరాత్ రాష్ట్రానికేనా? : వినోద్ కుమార్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర నిధుల విడుదల విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మండిపడ్డారు. కేవలం గుజరాత్ రాష్ట్రానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మండిపడ్డారు. కేంద్రం నిధుల విడుదలలో కేవలం గుజరాత్ రాష్ట్రానికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రమైన గుజరాత్కు నిధులను విరివిగా విడుదల చేయడం ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు. తొమ్మిది నెలల్లో ఒక్క గుజరాత్కే రూ.1,37,655 కోట్ల విలువైన ప్రాజెక్టులు, పరిశ్రమలకు నిధులను మంజూరు చేశారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్లో నిధుల వరద పారించారని వినోద్ కుమార్ అన్నారు. దాదాపు 40 సార్లు అక్కడ పర్యటించి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని విమర్శించారు. ప్రధానమంత్రి హోదాలో దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యతను మోదీ విస్మరిస్తున్నారన్న ఆయన.. ఇది ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదన్నారు. ప్రధాని మోదీ ఏకపక్ష విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతారని వినోద్కుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్