Andhra News: వైకాపా ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. గో బ్యాక్ అంటూ నినాదాలు
వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ తగిలింది. పలు శంకుస్థాపన కార్యక్రమాలను హాజరైన ఎమ్మెల్యేను అదే
ఎస్.రాయవరం: వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ తగిలింది. పలు శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను అదే పార్టీకి చెందిన ఒక వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం, నాడు-నేడు పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని, ప్రభుత్వ కార్యక్రమాలపై ఎందుకు సమాచారం ఇవ్వలేదని వైకాపా ఎంపీటీసీలు, సర్పంచులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాన్వాయ్కి అడ్డుగా కూర్చున్నారు. ఎమ్మెల్యే గోబ్యాక్... ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కాన్వాయ్ ముందు బైఠాయించిన గుడివాడ సర్పంచి శ్రీనుబాబు, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా నేతల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో గుడివాడ సర్పంచి శ్రీనుబాబు గాయపడగా, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, వైస్ ఎంపీపీ అప్పలరాజు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు నాయకులను చెదరగొట్టడంతో అంగన్వాడీ ప్రారంభం, నాడు- నేడు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అక్కడనుంచి వెనుదిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.