Andhra News: వైకాపా ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు

వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ తగిలింది. పలు శంకుస్థాపన కార్యక్రమాలను హాజరైన ఎమ్మెల్యేను అదే

Updated : 24 Sep 2022 14:35 IST

ఎస్.రాయవరం: వైకాపా ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు అసమ్మతి సెగ తగిలింది. పలు శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను అదే పార్టీకి చెందిన ఒక వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం గుడివాడలో అంగన్వాడీ కేంద్రం ప్రారంభం, నాడు-నేడు పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదని, ప్రభుత్వ కార్యక్రమాలపై ఎందుకు సమాచారం ఇవ్వలేదని వైకాపా ఎంపీటీసీలు, సర్పంచులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌కి అడ్డుగా కూర్చున్నారు. ఎమ్మెల్యే గోబ్యాక్‌... ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

కాన్వాయ్‌ ముందు బైఠాయించిన గుడివాడ సర్పంచి శ్రీనుబాబు, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా నేతల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో గుడివాడ సర్పంచి శ్రీనుబాబు గాయపడగా, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, వైస్ ఎంపీపీ అప్పలరాజు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు నాయకులను చెదరగొట్టడంతో అంగన్వాడీ ప్రారంభం, నాడు- నేడు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అక్కడనుంచి వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని