National News: భార్యకు కానుకగా చంద్రుడిపై స్థలం

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్‌ మహాజన్‌ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. వాస్తవానికి గతేడాదే జాబిల్లిపై స్థలం కొనుగోలు చేయాలని ఆయన భావించారు. అందుకోసం ఇంటర్నేషనల్‌ లునార్‌ ల్యాండ్స్‌

Updated : 26 Jun 2022 08:23 IST

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్‌ మహాజన్‌ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. వాస్తవానికి గతేడాదే జాబిల్లిపై స్థలం కొనుగోలు చేయాలని ఆయన భావించారు. అందుకోసం ఇంటర్నేషనల్‌ లునార్‌ ల్యాండ్స్‌ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది ప్రక్రియ అనంతరం.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో పంపించారు. అయితే ఎంత డబ్బు చెల్లించిందీ మాత్రం వెల్లడించలేదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయమని.. డబ్బుది కాదని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త గతంలో తన కుమారుడికి చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని