NEPAL vs MON: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. ఆసియా క్రీడల్లో రికార్డుల మోత
టీ20 క్రికెట్లో నేపాల్ చరిత్ర సృష్టించింది. మంగోలియాతో (NEP vs MON) జరిగిన మ్యాచ్ల్లో సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో (Asian Games) పురుషుల క్రికెట్ తొలి రోజే రికార్డుల మోత మోగింది. నేపాల్ - మంగోలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మంగోలియా బౌలింగ్లో నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలో నాలుగు అంతర్జాతీయ రికార్డులను నమోదు చేశారు. అత్యంత వేగవంతమైన అర్ధశతకం, వేగవంతమైన సెంచరీ, టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టు, భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగానూ రికార్డు సృష్టించింది.
- నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ (52 నాటౌట్: 10 బంతుల్లో 8 సిక్స్లు) అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధించిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. దీపేంద్ర సింగ్ 9 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అంతకుముందు భారత బ్యాటర్ యువరాజ్ సింగ్ పేరిట (12 బంతుల్లో) ఈ రికార్డు ఉంది. దీపేంద్ర కూడా ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు బాదేశాడు.
- కుశాల్ మల్లా అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాటర్గా అవతరించాడు. కేవలం 34 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. కుశాల్ మొత్తం 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 12 సిక్స్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. అతడు బంగ్లాదేశ్పై 35 బంతుల్లోనే (2017లో) శతకం కొట్టాడు.
- మంగోలియాపై నేపాల్ 20 ఓవర్లలో 314/3 స్కోరు చేసింది. టీ20ల్లో ఒక జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2019లో ఐర్లాండ్పై అఫ్గానిస్థాన్ 278/3 స్కోరు సాధించింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా ఉండేది. దానిని నేపాల్ అధిగమించింది. టీ20ల్లో 300కిపైగా పరుగులు చేసిన ఏకైక జట్టుగా నేపాల్ నిలిచింది.
- అత్యధిక తేడాతో గెలిచిన జట్టుగా నేపాల్ అవతరించింది. మంగోలియాపై 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటైంది. మంగోలియా బ్యాటర్ దావసురెన్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఇంతకుముందు టర్కీపై చెక్ రిపబ్లిక్ 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు నేపాల్ ఆ రికార్డును తుడిచిపెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.