Ruturaj Gaikwad: గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు ఓటముల తర్వాత చెన్నై మళ్లీ పుంజుకుంది. కీలకమైన మ్యాచ్లో హైదరాబాద్ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98), డారిల్ మిచెల్ (52), దూబె (39) అదరగొట్టారు. దీంతో 212/3 స్కోరు చేయగలిగింది. అనంతరం హైదరాబాద్ 134 పరుగులకే ఆలౌటైంది. తుషార్ దేశ్పాండే (4/27), జడేజా (1/22), పతిరన (2/17), ముస్తాఫిజుర్ (2/19) బౌలింగ్లో రాణించారు. తృటిలో తన సెంచరీని చేజార్చుకున్న రుతురాజ్ (Ruturaj Gaikwad) జట్టు విజయం సాధించడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘తేమ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇలాంటి మ్యాచుల్లో ఆడటం చాలా కష్టం. చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రదర్శనతో హైదరాబాద్పై 70+ రన్స్ తేడాతో గెలిచాం. టాస్ ఓడిపోవడమూ మాకు కలిసొచ్చింది. గత మ్యాచ్లోనే మేం వేడి, ఉక్కపోత వాతావరణంలో 40 ఓవర్లపాటు మైదానంలో ఉన్నాం. ఇప్పుడు ఇదే పరిస్థితి. నేను కాస్తలో సెంచరీ మిస్ అయినందుకు బాధేం లేదు. కనీసం 220 + స్కోరు చేయాలని అనుకున్నాం. అయితే, నాలుగైదు షాట్లు సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇదే నన్ను బాధించింది. కానీ, మా బౌలర్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా బౌలింగ్ వేశారు. గత మ్యాచ్లో మేం కొన్ని తప్పిదాలు చేశాం. వాటిని సరిచేసుకొని విజయం సాధించగలిగాం. ఫీల్డింగ్లోనూ చాలా మెరుగయ్యాం. తుషార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కానీ, మ్యాచ్ టర్నింగ్ స్పెల్ మాత్రం జడ్డూదే. బంతిపై పట్టు దొరకడమే కష్టమైన సమయంలో నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులే ఇవ్వడం అభినందనీయం. సీనియర్లకు నేను చెప్పేదేం ఉండదు’’ అని రుతురాజ్ వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును రుతురాజ్ దక్కించుకున్నాడు.
బ్యాటింగ్ తీసుకోనందుకు..: కమిన్స్
‘‘ఈ మ్యాచ్ ఫలితం తర్వాత తొలుత బ్యాటింగ్ తీసుకొని ఉంటే బాగుండని భావించలేదు. తప్పకుండా గెలుస్తామని అనుకున్నాం. అయితే, చెన్నై బ్యాటర్లు చాలా బాగా ఆడారు. 210+ స్కోరును లక్ష్యంగా నిర్దేశించారు. మా బ్యాటింగ్ లైనప్తో ఛేదిస్తామని అనుకున్నప్పటికీ.. పిచ్ ఒక్కసారిగా మారిపోయింది. మంచు ప్రభావం మ్యాచ్ మొత్తం కొనసాగింది. తప్పకుండా తదుపరి మ్యాచుల్లో పుంజుకొని విజయం సాధిస్తాం’’ అని కమిన్స్ తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఎంఎస్ ధోనీకిది 150వ ఐపీఎల్ మ్యాచ్ విజయం. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డు.
- ఐపీఎల్లో పరుగుల పరంగా హైదరాబాద్కిదే భారీ ఓటమి. ఇప్పుడు 78 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు చెన్నై చేతిలోనే (2013లో) 77 రన్స్ తేడాతో ఓడింది.
- ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ తర్వాత రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టు హైదరాబాద్. రెండు మ్యాచుల్లోనూ లక్ష్య ఛేదన సమయంలోనే కావడం గమనార్హం.
- ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ తొలిసారి ఆలౌటైంది. అలానే చెన్నై ప్రత్యర్థి జట్టును మొదటిసారి ఆలౌట్ చేయడం గమనార్హం.
- ఒక ఐపీఎల్ మ్యాచ్లో 9 మంది బ్యాటర్లు క్యాచ్ల ద్వారానే పెవిలియన్కు చేరారు. ఇలా జరగడం ఇది మూడోసారి. హైదరాబాద్కు మాత్రం తొలిసారి.
- ఒక ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రెండో ఆటగాడు డారిల్ మిచెల్. హైదరాబాద్పై 5 క్యాచ్లను పట్టాడు. అంతకుముందు ముంబయిపై నబీ (ఎస్ఆర్హెచ్) కూడా ఐదు క్యాచ్లను అందుకొన్నాడు.
- ఒకే వేదికపై అత్యధిక విజయాలు సాధించిన మూడో జట్టు చెన్నై. చెపాక్లో ఆ జట్టుకిది 50వ విక్టరీ. వాంఖడేలో ముంబయి 51, ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా 50 విజయాలతో కొనసాగుతున్నాయి.
- టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200+ స్కోర్లు చేసిన తొలి జట్టుగా చెన్నై అవతరించింది. సీఎస్కే 35 సార్లు చేయగా.. సోమర్సెట్ (34), భారత్ (32), బెంగళూరు (31), యార్క్షైర్ (29), సర్రే (28) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
సెలవుల్లో అమెరికా వెళ్లేందుకు తానెంతో ఇష్టపడతానంటూ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. అందుకు గల కారణాలను వివరించాడు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
మెగా లీగ్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఐదు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరుకుంటున్న వేళ.. మరో ఆసక్తికర మ్యాచ్ అభిమానులను అలరించేందుకు వస్తోంది. -
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్
మ్యాచులన్నీ ముగిసినా.. ఇటు బయటకు వెళ్లలేని పరిస్థితి. అటు నాకౌట్ దశకు అర్హత దక్కుతుందో తెలియని సంకటస్థితి దిల్లీ జట్టుకు ఉంది. -
హెడ్ కోచ్గా కొనసాగమని కోరినా.. తిరస్కరించిన ద్రవిడ్
ద్రవిడ్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కోచ్ పదవి నుంచి వైదలగాలని భావిస్తున్నాడు. కనీసం టెస్టు జట్టుకు కూడా అతడు కోచ్గా ఉండేందుకు నిరాకరించినట్లు సమాచారం. -
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ - సంజీవ్ గోయెంకా సంభాషణ వైరల్గా మారిపోయింది. ఆ పరిణామాలపై లఖ్నవూ కోచ్ స్పందించాడు. -
పవర్ప్లేలో వికెట్లు కోల్పోవడం పెద్ద దెబ్బే: కేఎల్ రాహుల్
లఖ్నవూకు ఈ సీజన్లో ఏడో ఓటమి ఎదురైంది. ప్లేఆఫ్స్కు వెళ్దామనే ఆశలకు బ్రేక్ పడేలా ఉంది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
హార్దిక్ టైటిల్ విన్నింగ్ కెప్టెన్.. వారిద్దరు ఐపీఎల్లో ఏం సాధించారు?: గంభీర్
హార్దిక్ నాయకత్వంపై విమర్శలు చేసిన విదేశీ మాజీ క్రికెటర్లను గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఐపీఎల్లో ఆ ఇద్దరి పాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. -
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సెమీస్లో గౌరవ్
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ