ద్రవిడ్తో 18 ఏళ్ల నాటి సంఘటన.. గుర్తు చేసుకున్న స్కాట్లాండ్ కెప్టెన్
స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోట్జర్ పద్దినెనిమిది ఏళ్ల కింద చోటు చేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. రవిశాస్త్రి తర్వాత భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా..
ఇంటర్నెట్ డెస్క్: ద్రవిడ్తో తనకున్న పరిచయాన్ని బయటపెట్టాడు స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోట్జర్. భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్కు ఎంపికైన సందర్భంగా 18 ఏళ్ల కిందట చోటు చేసుకున్న ఓ సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నాడు. అది 2003. అప్పటికే రాహుల్ ద్రవిడ్ దిగ్గజ బ్యాటర్. టీమ్ ఇండియాకు కెప్టెన్గా పని చేశాడు. అలాంటి రాహుల్ కౌంటీల్లో స్కాటిష్ సాల్టైర్స్ జట్టుకు ఆడాడు. 2003లో జరిగిన టోర్నమెంట్లో రాహుల్తో కుర్రాడైన కైల్ కోట్జర్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అప్పటికి కోట్జర్కు 19 ఏళ్లే. నార్త్థాంప్టన్తో మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ శతకం (114) చేశాడు. పాపం కోట్జర్ మాత్రం తొలి బంతికే వెనుదిరిగాడు. తొలి బంతిని ఎదుర్కొన్న కోట్జర్ పరుగు తీసేందుకు యత్నించి రనౌట్గా పెవిలియన్కు చేరాడు. ఇప్పుడు మళ్లీ టీమ్ఇండియాతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విషయాన్ని పంచుకున్నాడు. ‘‘రాహుల్ ఎంతో వినయవిధేయత కలిగిన వ్యక్తి. ఆటగాళ్లందరితో చాలా బాగా మాట్లాడేవాడు. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి’’ అని చెప్పాడు.
ద్రవిడ్ కేవలం మూడు నెలల అగ్రిమెంట్ను మాత్రమే స్కాట్లాండ్ కౌంటీతో చేసుకున్నాడు. పదకొండు మ్యాచుల్లో 60కి పైగా సగటుతో దాదాపు 600కి పైగా పరుగులు చేశాడు. అయినప్పటికీ ఆ సీజన్లో స్కాట్లాండ్ కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించింది. ‘‘రాహుల్, నేను రనౌట్లో భాగస్వాములం. అందులో ద్రవిడ్ కాకుండా నేను రనౌట్ అయ్యాను. అయితే అది మంచిదే అనుకుంటున్నా. అప్పటికే స్కాటిష్ జట్టుకు ద్రవిడ్ కీలక ఆటగాడు. మేము అనుకున్న విధంగానే చాలా బాగా ఆడాడు. జట్టుకు అవసరమైన పరుగులు సాధించాడు. నాకు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తే. ‘నో’ అనే పదం అటువైపు (ద్రవిడ్ నుంచి) వచ్చింది. వెనక్కి వెళ్లమని సంకేతం వచ్చింది. అయినా దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యా’’ అని కోట్జర్ చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్