T20 Rankings: కోహ్లీ, రాహుల్ ర్యాంకులు పడ్డాయ్.. ఆ జాబితాల్లో అయితే జాడే లేదు!
టీ20 ర్యాంకులను విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (ICC T20 Rankings)లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) స్థానాలు పడిపోయాయి. పాకిస్థాన్తో మ్యాచ్లో అర్ధశతకం సాధించిన విరాట్ కోహ్లీ (725) ఐదో స్థానానికి చేరగా.. తొలి మ్యాచ్లో విఫలమైన కేఎల్ రాహుల్ (684) ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. బ్యాటర్ల టాప్ 10 (Top 10) జాబితాలో కేవలం ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్లో ఉన్న డేవిడ్ మలన్ (Dawid Malan) (831) కంటే కేవలం పదకొండు పాయింట్లు మాత్రమే బాబర్ (820) వెనుకబడి ఉన్నాడు. మూడో స్థానాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ (743) ఆక్రమించాడు. పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (727) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో కోహ్లీ, ఆరో స్థానంలో ఫించ్ (720), ఏడో స్థానంలో డేవిడ్ కాన్వే (714), ఎనిమిదిలో కేఎల్ రాహుల్, తొమ్మిదిలో ఎవిన్ లూయిస్ (679), పదో స్థానంలో హజ్రతుల్లా (671) ఉన్నారు.
బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ (295) ఆల్రౌండర్ల జాబితాలో టాప్ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ (275) ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రైజ్ షంసి (750) మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక ప్లేయర్ వహిందు డిసిల్వా (726), రషీద్ ఖాన్ (720) ఉన్నారు. అయితే ఆల్రౌండర్లు, బౌలర్ల జాబితాలో ఒక్కరంటే ఒక్క భారతీయ క్రికెటర్ కూడా చోటు సంపాదించలేకపోవడం గమనార్హం. జట్లపరంగా చూస్తే.. తొలి మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్ ఉండగా.. న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), ఆస్ట్రేలియా (6), అఫ్గానిస్థాన్ (7), బంగ్లాదేశ్ (8), శ్రీలంక (9), వెస్టిండీస్ (10) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది