ODI World cup: భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌.. వాతావరణం అనుకూలించేనా?

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై క్లారిటీ వచ్చింది.

Published : 19 Nov 2023 01:54 IST

అహ్మదాబాద్‌: వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు (ODI Worldcup Final) సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (Ind vs Aus) మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, వాతావరణం సహకరిస్తుందా?లేదా అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ క్లారిటీ ఇచ్చింది. వర్ష సూచనలేదని పేర్కొంది. వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, దాదాపు 32 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అయితే, 17 నుంచి 19 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించింది. 2003 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని