Jemimah Rodrigues: ‘రీల్స్ కాదు.. రన్స్ చెయ్’.. బ్యాట్తోనే ట్రోలర్లపై రోడ్రిగ్స్ రోరింగ్!

‘‘ఎప్పుడూ చూసినా మైదానంలో తిరుగుతూ ఉంటావు. రీల్స్ చేసుకుంటూ ఉంటావు. ఆడేదెప్పుడు? అనవసరంగా జట్టులో ఉంచారు’’.. ఇవీ జెమామీ రోడ్రిగ్స్ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రోడ్రిగ్స్ ఈ విజయం అనంతరం కన్నీళ్లు పెట్టుకొంది. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.
వన్డే ప్రపంచకప్ సెమీస్లో ఆసీస్పై భారత్ అద్వితీయమైన విజయం సాధించింది. అసాధ్యమనుకున్న టార్గెట్ను ఛేదించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇదంతా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తోపాటు జెమీమా రోడ్రిగ్స్ చలవే. మరీ ముఖ్యంగా ఆఖరివరకూ క్రీజ్లో ఉండి జట్టును గెలిపించిన రోడ్రిగ్స్ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేం. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్కు చేరిన ఆసీస్పై 127 పరుగులతో జెమీమా అజేయంగా నిలిచింది. రోడ్రిగ్స్ రోరింగ్ అంటూ అభిమానులు పిలుచుకోవడం వెనక చాలా శ్రమ ఉంది. ఈ గెలుపుతో అప్పటివరకూ ఆమెలో దాగి ఉన్న కన్నీళ్లన్నీ జలజలా బయటకు వచ్చేశాయి. వద్దన్నవారే జట్టులో ఉండాల్సిందే అనే స్థాయికి రోడ్రిగ్స్ చేరుకుంది.
ఆ కన్నీళ్లలో..
సాధారణంగా ప్రపంచ కప్ గెలిస్తేనో లేకపోతే ఏదైనా భారీ టోర్నీలో విజయం సాధిస్తేనో భావోద్వేగానికి గురికావడం సహజం. కానీ, టీమ్ఇండియా సెమీస్లో ఆసీస్పై గెలవడంతోనే సంబరాలు అంబరాన్నంటాయి. శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ అయితే మైదానమంతా కలయతిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది. సెంచరీ చేసిన తర్వాత కూడా సంబరాలు చేసుకోని ఆమె.. మ్యాచ్ విజయం అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసింది. నవీ ముంబయి తన హోం గ్రౌండ్ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా చేయడానికి మరో కారణం ఆమెపై వచ్చిన ట్రోలింగ్కు తన బ్యాటింగే సమాధానం చెప్పిందనే ఆత్మవిశ్వాసమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
రీల్స్ చేస్తుంది.. గిటార్ అంటే ప్రాణం
క్రికెట్లోనే కాకుండా జెమీమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ కూడా ఆడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే క్రికెటర్. రీల్స్ చేస్తూ సందడిగా ఉంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్కు దాదాపు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక గిటార్ వాయిస్తూ పాటలు పాడటం ఆమెకెంతో ఇష్టం. ఇన్స్టా వీడియోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అయితే, ఇవన్నీ ఆమెపై ఓ రకంగా ప్రతికూలంగా మారడానికి కారణం. ఏదైనా మ్యాచ్లో విఫలమైతే వెంటనే జెమీమాను టార్గెట్ చేసేవారికి ఈ రీల్స్ ఆయుధంగా మారేది. ఎప్పుడు చూసినా రీల్స్, వీడియోలు చేసుకోవడం కాదు ఆటపై దృష్టి పెట్టాలంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు.
అత్యుత్తమ ఫీల్డర్ కూడానూ..
జెమీమా రోడ్రిగ్స్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. సన్నగా రివటాలా ఉండే జెమీమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది. అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యాలతో జెమీమా రోడ్రిగ్స్ ‘జాంటీ రోడ్స్’ను గుర్తుకుతెచ్చేలా ప్రదర్శన ఇస్తుంటుంది. అందుకు తాజా ఉదాహరణ ఆసీస్తో సెమీస్. తాలియా మెక్గ్రాత్ను ఔట్ చేసిన తీరు అద్భుతం. ఇక బంతిని ఆపడంలో ఆసీస్కు దీటుగా స్పందించింది. అసలు జట్టులో స్థానం ఉంటుందో, లేదో అనే పరిస్థితి నుంచి తన ప్లేస్ను సుస్థిరం చేసుకొనే స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

వైరల్ పిక్.. గురుభక్తి చాటుకున్న హర్మన్ప్రీత్
మైదానంలో హర్మన్ప్రీత్ తన గురువు కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. - 
                                    
                                        

‘మీరు భావితరాల ఆడ పిల్లలకు ఘన వారసత్వాన్ని ఇచ్చారు’
భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ను నెగ్గడంపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తమ స్పందనను తెలియజేశారు. - 
                                    
                                        

ఇంకా కలలోనే ఉన్నామా: జెమీమా-మంధాన కప్ ఫొటోలు వైరల్
Womens World Cup: వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిల జట్టు ఆనందంలో మునిగితేలుతోంది. - 
                                    
                                        

వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా
తొలిసారి ప్రపంచ కప్ను నెగ్గిన భారత మహిళా జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. హర్మన్ సేనకు భారీ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
భారత మహిళా జట్టు అద్భుతం చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కొనియాడాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని విజేతగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించాడు. - 
                                    
                                        

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
ఒక్క ఓటమితో జట్టంతా డీలా పడటం సహజం. కానీ, దాన్నుంచి బయటకొచ్చి విజేతగా నిలవడం మాత్రం అద్భుతం. అలాంటి దానిని భారత మహిళా జట్టు చేసి చూపించింది. - 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. - 
                                    
                                        

వాళ్ల వెనుక అతడు
భారత మహిళల క్రికెట్ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం. కానీ ఇప్పుడు భారత్ మారింది. - 
                                    
                                        

కల తీరెలే కప్పందగా..
భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్. ప్రతీక రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె.. తన తొలి మ్యాచ్లో విఫలమైనా ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. - 
                                    
                                        

వచ్చింది.. గెలిపించింది
వారం ముందు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచకప్ వీక్షకురాలు. టీవీలో భారత జట్టు ఆట చూస్తూ ఉంది. కానీ ఉన్నట్లుండి అంతా మారిపోయింది. ఆమె టీవీ లోపలికి వెళ్లిపోయింది. భారత జట్టులో సభ్యురాలై ప్రపంచకప్లో ఆడేసింది. - 
                                    
                                        

కొత్త బంగారు లోకం
ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం దగ్గర్నుంచి.. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందే వరకు! రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్థితి నుంచి.. రక్షణ వలయం లేకుండా బయటికి వెళ్లలేని దశ వరకు! ప్రత్యక్ష ప్రసారమే లేని రోజుల నుంచి. - 
                                    
                                        

మన వనిత.. విశ్వవిజేత
ఆట ఏదైనా ప్రపంచకప్ అంటే.. ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు, బంతి పట్టిన ప్రతి అమ్మాయీ దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారీ నిరాశే. - 
                                    
                                        

హర్మన్ డెవిల్స్
అప్పట్లో కపిల్ నేతృత్వంలో పురుషుల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచ కప్ను అందించిన జట్టును ‘కపిల్ డెవిల్స్’ అన్నారు. అసలు అంచనాలే లేకుండా అద్వితీయ ప్రదర్శన చేస్తూ అరివీర భయంకర వెస్టిండీస్ను ఓడించి 1983లో అద్భుతం చేసింది ఆ భారత జట్టు. - 
                                    
                                        

దొరికింది ఓ ఆణిముత్యం
భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. - 
                                    
                                        

మహిళల క్రికెట్లో మలుపు
వన్డే ప్రపంచకప్లో భారత్ విజయం యావత్ మహిళల క్రికెట్ను మార్చబోతోందని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. 1983లో కపిల్ సేన విజయం ప్రపంచ క్రికెట్ను మార్చినట్లుగానే.. - 
                                    
                                        

మనకొకటి..
అర్ష్దీప్ జట్టులో ఉండాలి.. గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఆస్ట్రేలియాతో సిరీస్లో 0-1తో వెనకబడిన దశలో అతడికి చోటు లభించింది. ఆ అవకాశాన్ని అతడు వమ్ము చేయలేదు. - 
                                    
                                        

అప్పుడు కపిల్.. ఇప్పుడు అమన్
దక్షిణాఫ్రికా గెలవాలంటే 54 బంతుల్లో 79 పరుగులు చేయాలి. అయినా ఆ జట్టు ధీమాగా ఉంది. సెంచరీ చేసిన కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇంకా క్రీజులో ఉండడమే ఇందుకు కారణం. - 
                                    
                                        

టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు కేన్ విలియమ్సన్ టీ20లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున 93 టీ20లు ఆడిన కేన్.. 2575 పరుగులు సాధించాడు. 2011లో జింబాబ్వేపై పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ బ్యాటర్. - 
                                    
                                        

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
మహిళల ప్రపంచకప్ (Womens World Cup)లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. - 
                                    
                                        

మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్
ముంబయి వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ సేన 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) చెలరేగారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం!
 - 
                        
                            

మ్యాచ్ బాల్ వేళ.. 1983లో గావస్కర్.. నేడు హర్మన్ప్రీత్
 - 
                        
                            

వైరల్ పిక్.. గురుభక్తి చాటుకున్న హర్మన్ప్రీత్
 - 
                        
                            
చైనాతో మొన్న డీల్.. నేడు వార్నింగ్: ట్రంప్ హెచ్చరికలు దేనికంటే..?
 - 
                        
                            

రూ.895 కోట్ల నగల చోరీ.. చిల్లర దొంగల పనే..!
 - 
                        
                            

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
 


