దక్షిణ మధ్య రైల్వేకి రూ.62 కోట్ల చెక్కు
కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం సింగరేణి సంస్థ.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.62.17 కోట్ల చెక్కును శుక్రవారం అందజేసింది. ఈ కొత్త రైల్వేలైన్ని సింగరేణి కాలరీస్- దక్షిణమధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో
అందజేసిన సింగరేణి అధికారులు
ఈనాడు, హైదరాబాద్: కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం సింగరేణి సంస్థ.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.62.17 కోట్ల చెక్కును శుక్రవారం అందజేసింది. ఈ కొత్త రైల్వేలైన్ని సింగరేణి కాలరీస్- దక్షిణమధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి. తన వాటా చివరి విడత మొత్తాన్ని ఇచ్చే క్రమంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) జె.అల్విన్, జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, జీఎం (సివిల్) రమేశ్బాబు సికింద్రాబాద్లోని రైల్నిలయంలో ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్యని కలిసి చెక్కు అందజేశారు. ఈ ప్రాజెక్టు కోసం తన వంతుగా మొత్తం రూ.618.55 కోట్లను చెల్లించినట్లు సింగరేణి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్మాణపనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అల్విన్ కోరగా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మల్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ద.మ.రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ ఆర్.ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం