నేటి నుంచి పీజీ వైద్య కన్వీనర్‌ కోటా ప్రవేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని పీజీ వైద్యవిద్య సీట్లలో కన్వీనర్‌ కోటాలో తొలివిడత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ నెల 25న ఉదయం 8 నుంచి

Published : 25 Jan 2022 05:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లోని పీజీ వైద్యవిద్య సీట్లలో కన్వీనర్‌ కోటాలో తొలివిడత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ నెల 25న ఉదయం 8 నుంచి 27న మధ్యాహ్నం 2 గంటల వరకూ అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలంది. విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లతో పాటు నిమ్స్‌లోని పీజీ సీట్లను కూడా భర్తీ చేయనున్నట్లు వర్సిటీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని