
Dollar seshadri: శేషాద్రికి తుది వీడ్కోలు
తిరుపతిలో అంత్యక్రియలు పూర్తి
హాజరైన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
డాలర్ శేషాద్రి పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు, చిత్రంలో శేషాద్రి సతీమణి
ఈనాడు-తిరుపతి, ఈనాడు డిజిటల్- తిరుపతి: విశాఖలో సోమవారం హఠాన్మరణం చెందిన తితిదే ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్యక్రియలు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆయన సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. తిరుపతిలోని సిరిగిరి అపార్టుమెంట్కు ప్రముఖులు, తితిదే అర్చకులు, ఉద్యోగులు, స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం తిరుపతి వచ్చి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. సుమారు 30 నిమిషాలు అక్కడే ఉండి శేషాద్రి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ప్రాచీన సంప్రదాయాలకు సంబంధించి పలు పుస్తకాలను శేషాద్రి రచించారని, భావితరాలకు అందించేందుకు తితిదే వాటిని అచ్చువేయించాలని సూచించారు. శేషాద్రి ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకు తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితోపాటు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి పాడె మోశారు.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.