‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇంటర్నెట్డెస్క్: మలయాళంలో వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil). అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ (sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప: ది రైజ్’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తొలి భాగంలో భన్వర్సింగ్ షెకావత్గా నటించి మెప్పించారు. ప్రస్తుతం సిద్ధమవుతోన్న ‘పుష్ప2’ (pushpa 2)లో ఆయన పాత్ర మరింత విస్తృతంగా ఉండనుంది. ముఖ్యంగా పుష్పరాజ్, భన్వర్సింగ్ల మధ్య సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్లు ఉంటాయని టాలీవుడ్ టాక్. ఈక్రమంలో ఫహద్ ఫాజిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘పుష్ప 2’ తర్వాత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనంటున్నారు దీనిపై ఏమంటారు? అని ప్రశ్నించగా, ఫహద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు
‘‘దేనికైనా డబ్బు అనేది ఒక కారణం. కానీ, అదొక్కటే కాదు కదా! నేను ఇంటినుంచి బయటకు వచ్చి చేసే పని ఏదైనా నాలో ఉత్సాహం నింపేదిగా ఉండాలి. సుకుమార్ సర్తో కలిసి పనిచేయడం నిజంగా ఆనందంగా ఉంది. భన్వర్సింగ్ పాత్రకు ఎవరైతే సరిపోతారో ఆయనకు బాగా తెలుసు. అందుకే నేను సినిమాలో ఉన్నా. మేమంతా కలిసి ఒక భారీ ఇండియన్ కమర్షియల్ ఫిల్మ్ చేస్తున్నాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే నేను సినిమా సెట్కు వెళ్తాను. ‘పుష్ప’ టీమ్తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నేనూ ఎంతో ఆస్వాదిస్తా. కానీ, దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విలన్ను అవుతానో, లేదో మాత్రం నాకు తెలియదు. కేవలం డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదు. ‘కుంబలంగి నైట్స్’, ‘ట్రాన్స్’ చిత్రాలతో చాలానే సంపాదించా. నటన ద్వారా డబ్బులు సంపాదించాలని నేను అనుకోవడం లేదు. 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చా. ఇది అనిశ్చితి కలిగిన వ్యాపారం. ఆర్థిక అస్థిరత్వాన్ని నేను సమర్థంగా ఎదుర్కోగలను. కేవలం రెండు సినిమాలు చేసి వెళ్లిపోవాలనుకున్నా. ఆ తర్వాత వచ్చినందతా బోనసే’’ అని ఫహద్ ఫాజిల్ అన్నారు.
శరవేగంగా చిత్రీకరణ జరపుకొంటున్న ‘పుష్ప2’ (Pushpa 2 The Rule) ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకురానుంది. రష్మిక కథానాయిక. సునీల్, అనసూయ, ధనుంజయ అజయ్, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తొలిభాగంతో పోలిస్తే, అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్తో మూవీని తీర్చిదిద్దుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘పుష్ప.. పుష్ప’ సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్గేల్తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు