Sam Pitroda: వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఖర్గే ఆమోదించారు.
దిల్లీ: ఎన్నికల వేళ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్పిట్రోడా (Sam Pitroda) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల వారసత్వ పన్నుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి మరువక ముందే తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగింది.
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
వరుస వివాదాలు..
- భారత్లోని భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడుతూ జాతి వివక్ష వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘‘తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమవాసులు అరబ్బులుగా.. ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా.. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా’’ కన్పిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడుతున్నారు.
- వారసత్వ పన్నుపై.. ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం పిట్రోడా వారసత్వ పన్నుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది’’ అని అన్నారు.
- రామమందిరంపై 2023 జూన్లో ఆయన రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్య, ఆరోగ్య సమస్యలను దేవాలయాలు పరిష్కరించలేవని అన్నారు. దేశవ్యాప్తంగా రామాలయం ప్రారంభోత్సవం కోసం ఎదురుచూసిన వేళ ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది.
- 1984లో చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లకు అనుకూలంగా 2019 మేలో పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.
- పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్పై వైమానిక దాడులు జరిపి ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. భారత వైమానిక దాడుల సామర్థ్యంపై ఆయన అనుమానం వ్యక్తంచేస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. సైన్యాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది.
- భారత రాజ్యాంగ రూపకల్పనలో బీఆర్ అంబేడ్కర్ కంటే.. భారత తొలి ప్రధాని నెహ్రూ పాత్రే ఎక్కువంటూ పిట్రోడా పెట్టిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది.
పిట్రోడా వ్యాఖ్యలు.. భాజపాకు అస్త్రాలు..
పిట్రోడా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల వేళ భాజపాకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును కాంగ్రెస్ నేతలు లాక్కోవాలనుకుంటున్నారని విమర్శించింది. ఇక పిట్రోడా చేసిన తాజా వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలకు దిగింది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!