Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్ ఓపెనర్లిద్దరే 9.4 ఓవర్లలోనే ఉఫ్మని ఊదేశారు. ట్రావిస్ హెడ్ (89*; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు) ఊచకోతతో ఉప్పల్ స్టేడియం ఊర్రూతలూగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. వాటిపై ఓ లుక్కేద్దాం.
- ఐపీఎల్ చరిత్రలో 160 కంటే పైచిలుకు స్కోరును అత్యంత వేగంగా ఛేదించిన తొలి జట్టుగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది.
- టోర్నీలో ఒక మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు (167) చేసిన జట్టుగానూ అవతరించింది. తర్వాత రెండు స్థానాల్లోనూ (దిల్లీపై 158/4), (ముంబయిపై 148/2) హైదరాబాదే ఉంది.
- ఒక సీజన్లో పవర్ ప్లేలో రెండుసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది.
- ఒక ఐపీఎల్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు (146 సిక్సర్లు.. 12 మ్యాచ్ల్లో) బాదిన జట్టుగా హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ రికార్డును సొంతం చేసుకుంది. 2018లో చెన్నై 145 సిక్స్లు.. 16 మ్యాచ్ల్లో పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
- ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్లు (35) బాదిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పాడు. 195 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
- ఒక ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు కూడా అభిషేక్ శర్మనే.
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలుండగా (100 కంటే ఎక్కువ టార్గెట్ ఉన్న మ్యాచ్ల్లో) విజయం సాధించిన జట్టుగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది.
- ఐపీఎల్లో పవర్ ప్లేలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా ట్రావిస్ హెడ్(4) నిలిచాడు. ఇవన్నీ అతడు ఈ సీజన్లో చేసినవే. డేవిడ్ వార్నర్ (6) తొలి స్థానంలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు