Delhi Vs Rajasthan: మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (86: 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. దిల్లీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్య ఛేదనలో తన జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే, ముకేశ్ వేసిన బంతిని భారీ షాట్కు యత్నించడంతో షైహోప్ అద్భుతంగా క్యాచ్ పట్టగా పెవిలియన్కు చేరాడు. కాగా, ఈ క్యాచ్ నిర్ణయం వివాదాస్పదమైంది. రిప్లే సందర్భంగా దిల్లీ ఫ్రాంచైజీ యజమాని పార్థ్ జిందాల్ రియాక్షన్ నెట్టింట వైరల్గా మారింది. ‘ఔట్.. ఔట్ ’అంటూ వీఐపీ గ్యాలరీలో నుంచి అరుస్తూ కనిపించారు. మ్యాచ్ అనంతరం సంజూశాంసన్తో పార్థ్ మాట్లాడారు. తాజాగా ఆ సంఘటనపై పార్థ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘సంజూ శాంసన్తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. అతడి పవర్ హిట్టింగ్ను ప్రత్యక్షంగా చూడటం అద్భుతంగా అనిపించింది. ఒక దశలో అతడు మమ్మల్ని చాలా కంగారుపెట్టాడు. అందుకే, అతడు ఔటైనప్పుడు అలా రియాక్షన్ ఇచ్చా. మ్యాచ్ అనంతరం సంజూతో సంభాషించా. అద్భుతమైన విజయం సాధించిన మా కుర్రాళ్లకు అభినందనలు’’ అని పార్థ్ వెల్లడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ 221/8 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 201/8కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ 2, ఖలీల్ 2, ముకేశ్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్, రసిక్ దార్ చెరో వికెట్ తీశారు.
సంజూ ‘మాస్టర్ బ్లాస్టర్’: హేడెన్
‘‘ఎప్పట్నుంచో కలలా అనిపించే ఇన్నింగ్స్ను సంజూశాంసన్ ఆడాడు. కేవలం 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. అతడి సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది. లఖ్నవూతో మ్యాచ్ను గెలిపించిన అతడు.. దిల్లీపైనా ఇలాంటి ఆటనే ప్రదర్శించాడు. జట్టు ఓడినా.. సంజూ ఆకట్టుకున్నాడు. స్పిన్, పేస్ను సమర్థంగా ఎదుర్కొనే ‘మాస్టర్ బ్లాస్టర్’. టీ20 క్రికెట్లో ఇలాంటి దూకుడైన గేమ్ ఆడాలి. దిల్లీపైనా కాస్త అదృష్టం కలిసివచ్చుంటే మ్యాచ్ను గెలిపించేవాడు’’ అని ఆసీస్ మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.