గుప్పిట్లోకి విమానాశ్రయం
ఉగ్రవాదులు పేట్రేగిపోయి పెద్దఎత్తున మారణహోమానికి పాల్పడిన నేపథ్యంలో అఫ్గాన్ రాజధాని కాబుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు మరింత పట్టు బిగించారు. మరోసారి దాడి జరిగే అవకాశాలున్నాయన్న..
రాజధాని కాబుల్పై మరింతగా పట్టు బిగించిన తాలిబన్లు
భారీగా ప్రజలు రాకుండా చర్యలు
కాబుల్: ఉగ్రవాదులు పేట్రేగిపోయి పెద్దఎత్తున మారణహోమానికి పాల్పడిన నేపథ్యంలో అఫ్గాన్ రాజధాని కాబుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు మరింత పట్టు బిగించారు. మరోసారి దాడి జరిగే అవకాశాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో విమానాశ్రయానికి పెద్దఎత్తున ప్రజలు రాకుండా నిలువరించడంపై దృష్టి సారించారు. విమానాశ్రయ మార్గాల్లో మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. చీకట్లోనూ దృశ్యాలు కనిపించేందుకు.. అఫ్గాన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రత్యేక కళ్లద్దాలను వారు వినియోగిస్తున్నారు. 2 వారాలుగా జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
భవితపై అయోమయం
అమెరికా బలగాల ఉపసంహరణకు గడువు ఈ నెల 31 కావడంతో పలువురిలో ఆందోళన పెరిగిపోతోంది. ‘‘అమెరికా పాస్పోర్ట్ ఉన్నవారినే పంపాల్సిందిగా అమెరికా వర్గాలు చెప్పినట్లు తాలిబన్లు స్పష్టంచేశారు. భవితపై బెంగగా ఉంది’’ అని అమెరికా సైన్యానికి అనువాదకుడిగా వ్యవహరించిన అఫ్గాన్ వ్యక్తి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సైనిక బలగాల తుది దశ ఉపసంహరణను అమెరికా ప్రారంభించింది. చనిపోయిన 13 మంది తమ సైనికుల మృతదేహాలను అమెరికాకు తరలిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది.
ఇప్పటికి 1.12 లక్షల మంది తరలింపు
గత రెండువారాల్లో అమెరికా నేతృత్వంలో దాదాపు 1.12 లక్షల మందిని వివిధ దేశాలకు తరలించినా ఇంకా కొన్ని వేల మంది తమవంతు కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం లోగా వారి ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది సందేహమే. తగిన పత్రాలు ఉన్నవారిని విమానాశ్రయం లోపలకు ఇప్పటికీ అనుమతిస్తున్నామని, దాదాపు 5,400 మంది ప్రజలు ప్రస్తుతం టెర్మినల్ భవనంలో నిరీక్షిస్తున్నారని అమెరికా వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఉన్న అఫ్గాన్లను తరలించే చర్యల్ని ముమ్మరం చేయాలంటూ ఇప్పటివరకు 28 మంది సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్కు లేఖలు రాశారు. అవసరమైతే వీసా నిబంధనల్ని సడలించాలని వారు సూచించారు.
వెనక్కి మళ్లుతున్న ఫ్రాన్స్, బ్రిటన్
అఫ్గాన్లో మోహరించిన తమ బలగాల్ని ఫ్రాన్స్ పూర్తిగా వెనక్కి తీసుకుంది. అమెరికా సేనలు వెళ్లిపోయిన తర్వాత ఎవరైనా అఫ్గాన్ను వీడిపోవాలంటే దానికి వీలుగా వాణిజ్య విమానాలను అనుమతిస్తామని తాలిబన్లు చెబుతున్నా వారి నియంత్రణలోని విమానాశ్రయానికి వచ్చేందుకు ఏ విమానయాన సంస్థ అయినా ముందుకు వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. తమ పౌరుల్ని అఫ్గాన్ నుంచి తరలించే పనిని ముగించినట్లు బ్రిటన్ ప్రకటించింది. అందరినీ తీసుకురావడం వీలు కాదని, తరలింపు క్రమంలో అనేకసార్లు తన కళ్లు చెమ్మగిల్లాయని బ్రిటన్ రక్షణ దళాల అధిపతి జనరల్ సర్ నిక్ కార్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో సవాల్తో కూడుకునేదని వివరించారు. చిట్టచివరి విమానం అక్కడి నుంచి వస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉద్వేగాన్ని కలిగిస్తోందన్నారు.
70 లక్షల మంది ఉపాధికి దెబ్బ
అఫ్గాన్లో కరవు కారణంగా 70 లక్షల మంది ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. ప్రతి ముగ్గురు అఫ్గాన్లలో ఒకరికి అత్యవసర ఆహార సాయం అందించాల్సి ఉందని పేర్కొంది. కరోనా వైరస్కు తోడు, ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అఫ్గాన్లకు తీవ్ర ఇక్కట్లు తప్పవని రోమ్ కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) పేర్కొంది. ‘‘గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ ఉత్పత్తులు 20% తగ్గుతాయి’’ అని ఎఫ్ఏవో అంచనా వేసింది.
జీతాల కోసం ఆందోళన
కాబుల్: కరోనా మహమ్మారి, తీవ్ర కరవు పరిస్థితులతో సతమతమవుతున్న అఫ్గాన్కు తాలిబన్ల దురాక్రమణ తోడుకావడంతో... ఆ దేశ పరిస్థితి ‘గోటిచుట్టుపై రోకటి పోటు’లా పరిణమించింది! కొద్దిరోజులుగా అఫ్గాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. రాజధానిలోని న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట వందలమంది పౌరులు శనివారం నిరసనకు దిగారు. జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వలేదని, మూడు రోజుల కిందటే బ్యాంకులు పునఃప్రారంభమైనా... చెల్లింపులు జరపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటీఎంల వద్ద కూడా ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. వాటి నుంచి ఒక్కొక్కరు రోజుకు 200 డాలర్లకు మించి తీసుకోకుండా అధికారులు ఆంక్షలు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు