మండలి ఛైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ ఎన్నికకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు  శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Published : 13 Mar 2022 06:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ ఎన్నికకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు  శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 11 గంటలకు ఛైర్మన్‌ ఎన్నిక జరుగనుంది.  ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ఇప్పటికే మండలి ఛైర్మన్‌ పదవికి తెరాస అభ్యర్థిగా ఎమ్మెల్సీ, మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 10:30 గంటలకు గుత్తా నామినేషను వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని