భూమి లేకున్నా అమ్మేస్తున్నారు!
తమది కాని భూమినీ కొందరు ఎంచక్కా అమ్మేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనతో సంబంధం లేకుండా ఆన్లైన్ దస్త్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఉన్న అవకాశాన్ని తమకు అనువుగా మలచుకుంటున్నారు. ఇది అసలు యజమానుల భూములకు
కొన్ని జిల్లాల్లో విస్తీర్ణాల నమోదులో తప్పిదాలు
ఆన్లైన్ దస్త్రాలతో విక్రయానికి యత్నాలు
ధరణిలో కట్టడికి లేని అవకాశం
మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి సమస్య
తమది కాని భూమినీ కొందరు ఎంచక్కా అమ్మేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనతో సంబంధం లేకుండా ఆన్లైన్ దస్త్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఉన్న అవకాశాన్ని తమకు అనువుగా మలచుకుంటున్నారు. ఇది అసలు యజమానుల భూములకు ఎసరు పెడుతోంది. భూ దస్త్రాల ప్రక్షాళనలో చోటుచేసుకున్న తప్పులను సరిచేయకుండానే పోర్టల్లో చేర్చడంతో చాలా జిల్లాల్లో ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే పలు కేసులు వెలుగుచూడగా.. మరికొన్ని జిల్లాల్లోనూ ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో విక్రయాలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల బాధితులతో విక్రయిస్తున్నవారు బేరసారాలకు దిగుతున్నారు. ధరణి పోర్టల్లో ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థ లేదని బాధితులు వాపోతున్నారు.
ఆన్లైన్లో హెచ్చుతగ్గుల నమోదుతోనే సమస్య
2017లో చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం ఆన్లైన్లో సమాచారం నిక్షిప్తం చేశారు. రైతుల పాసుపుస్తకాల్లో ఉన్న భూమి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే క్రమంలో కొన్ని జిల్లాల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అసలు రైతుల విస్తీర్ణంలో కోత పడి.. ఇతరులకు పెరిగింది. పాసుపుస్తకాలూ అదే మాదిరిగా జారీ అయ్యాయి. అదనపు విస్తీర్ణం నమోదైన కొందరు రైతులు ఇదే అదనుగా భూమిని విక్రయానికి పెడుతుండగా.. మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేరున గిఫ్ట్ డీడ్లు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు విస్తీర్ణాల్లో కోత పడిన రైతులకు ఆ మేరకు రైతుబంధు నిధులూ అందడం లేదు. 2018లో పాసు పుస్తకంలో పూర్తి విస్తీర్ణం నమోదైనప్పటికీ ఆ తరువాత కోత పడినవారూ ఉన్నారు.
* వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం గొట్టెముక్కలకు చెందిన అనంతయ్య కుటుంబానికి 13.25 ఎకరాలు ఉండగా ఆన్లైన్లో 10 ఎకరాలు మాత్రమే నమోదయింది. మిగిలిన విస్తీర్ణం మరో వ్యక్తి పేరుపై నమోదైనట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ధరణి ద్వారా క్రయవిక్రయాలకు పెట్టారంటూ కలెక్టరేట్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితం కూడా ఇదే మండలంలో ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదు కాగా.. విక్రయానికి పెట్టడంతో వివాదం పోలీసు స్టేషన్కు చేరింది.
* నల్గొండ జిల్లా గుర్రంపోడులో అయిదు నెలల క్రితం భూ యజమాని ప్రమేయం లేకుండానే మరొకరి పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ వేటు వేశారు. ఇదే జిల్లాలో గతేడాది ఆఖర్లో పీఏ పల్లి మండలంలో ఆటోమేటిక్ సాంకేతికత ఆధారంగా ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. తాను అప్పటికే విక్రయించిన భూమికి మ్యుటేషన్ పూర్తి కాలేదని తెలుసుకున్న ఓ మహిళా రైతు ధరణి పోర్టల్లో స్లాటు నమోదు చేసుకుని తన కూతురి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని కొన్న వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఆమెపై చర్య తీసుకున్నారు.
ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్లతో..
గతేడాది అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ధరణి పోర్టల్లోని ఎలక్ట్రానిక్ రికార్డుల ఆధారంగా ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మీసేవా కేంద్రంలో స్లాటు నమోదైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందితే తప్ప ఆపడానికి ఎవరికీ అధికారం లేదు. పైగా క్షేత్రస్థాయిలో భూ యాజమాన్య హక్కుల పరిశీలన లేకుండానే పోర్టల్లో ఉన్న రికార్డు మేరకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయిపోతోంది. లేని భూమికీ కొందరు పోర్టల్లో వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఒకవైపు తక్కువ విస్తీర్ణం నమోదైన రైతులు తమకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఆటోమెటిక్ రిజిస్ట్రేషన్లతో ఆ విస్తీర్ణాలు చేతులు మారుతున్నాయి. ఇలాగే కొనసాగితే హక్కుల విషయంలో న్యాయపరమైన వివాదాలు వస్తాయని భూ చట్టాల నిపుణులు పేర్కొంటున్నారు.
క్రిమినల్ కేసుల నమోదుకు యోచన
ధరణి సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఎక్కడైనా తమది కాని భూమిని ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా ఇరువర్గాలపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేయడంపై చర్చించినట్లు సమాచారం. రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపైనా సంఘం సమాచాలోచన చేసినట్లు తెలిసింది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!