మళ్లీ అలజడి
రాష్ట్రంలో మరోసారి కొవిడ్ అలజడి మొదలైంది. నాలుగు నెలలుగా నెమ్మదించిన కరోనా వైరస్ నెమ్మదిగా మళ్లీ జడలు విప్పుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించడంతో తిరిగి ఆందోళన ప్రారంభమైంది. కర్ణాటకలో తాజాగా
పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 189 నమోదు
కొవిడ్ బారిన సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కుటుంబం
పొంచి ఉన్న ఒమిక్రాన్ ముప్పు
ఆరోగ్యశాఖ అప్రమత్తం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కొవిడ్ అలజడి మొదలైంది. నాలుగు నెలలుగా నెమ్మదించిన కరోనా వైరస్ నెమ్మదిగా మళ్లీ జడలు విప్పుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించడంతో తిరిగి ఆందోళన ప్రారంభమైంది. కర్ణాటకలో తాజాగా రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ జాడలు కనిపించే అవకాశాలున్నాయా? అనే భయం వెన్నాడుతోంది. బుధవారం రెండు అంతర్జాతీయ విమానాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారిలో తెలంగాణకు చెందిన వారు 239 మంది, ఏపీకి చెందిన వారు 72 మంది, మహారాష్ట్రకు చెందినవారు 10 మంది, మధ్యప్రదేశ్కు చెందినవారు ఇద్దరు, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక్కరు, రాజస్థాన్కు చెందిన ఒక్కరున్నారు. వీరి సమాచారాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి ఇతర రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు పంపించారు. నెగెటివ్గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికులను 14 రోజుల పాటు వైద్యసిబ్బంది నిరంతరం పరిశీలన జరుపుతారు. ఈ పరిశీలనలో భాగంగా 8వ రోజు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో నెగెటివ్ వస్తే మరో 7 రోజుల పాటు హోం క్వారంటైన్లో పెట్టి, అప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే సాధారణ రాకపోకలకు అనుమతిస్తారు.
నిర్లక్ష్యంతో క్రమంగా పెరుగుతూ..
గత ఏడాది(2020) మార్చి 2న రాష్ట్రంలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. అదే ఏడాది మే, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో విజృంభించింది. అక్టోబరు నుంచి నెమ్మదించిన కరోనా వైరస్ ఫిబ్రవరి వరకూ క్రమేణా తగ్గుముఖం పట్టింది. మార్చిలో డెల్టా వేరియంట్ ప్రభావం మొదలైంది. ఇక్కడి నుంచి ప్రారంభమైన రెండోదశలో డెల్టా వేరియంట్ కారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది జులై నుంచి రెండోదశ ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పడుతూ వస్తోంది. నెమ్మదిగా సాధారణ జనజీవనం మొదలై కొవిడ్ నిబంధనలపై శ్రద్ధ తగ్గింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా.. గత 2 వారాలుగా క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ రోజుకు 180-200 వరకూ కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకర పరిణామమే. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు కొనసాగుతుండడం.. ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో.. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అతివేగంతోనే ఆందోళన
ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే ఆరింతలు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే నిర్ధారణ అయింది. కేవలం 3 రోజుల్లోనే 4 దేశాల నుంచి 24 దేశాలకు ఈ వేరియంట్ పాకింది. అంతర్జాతీయంగా ఒక పక్క కొవిడ్ నిబంధనలు కొనసాగుతుండగానే.. ఇంత వేగంగా వ్యాప్తి చెందడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ వేరియంట్తో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నా.. దీనివల్ల ఎంత ముప్పు పొంచి ఉందనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో అప్రమత్తం
బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబరు 21-డిసెంబరు 1 మధ్య బ్రిటన్ నుంచి 1,778 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను కేంద్రం తప్పనిసరి చేసింది. మిగిలిన దేశాలకు చెందిన వారిలో రెండు శాతం మందిని ఎంచుకుని పరీక్షలు చేస్తున్నారు. బుధవారం 303 మందిని పరీక్షించగా.. సదరు మహిళకు పాజిటివ్గా తేలింది.
డీఎంహెచ్వో కుటుంబంలో ఆరుగురికి వైరస్
సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్టుడే: సూర్యాపేట జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కోటాచలం కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా తిరుపతికి వెళ్లి రెండు రోజుల క్రితం స్వగ్రామం తిరుమలగిరికి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రెండురోజులుగా ఆయనను కలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 189 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,76,376కు పెరిగింది. మరో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,995కు చేరింది. తాజాగా 137 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకోగా.. మొత్తంగా 6,68,701 మంది ఆరోగ్యవంతులయ్యారు.
గురుకులాల్లో కలకలం
పటాన్చెరు, జూలూరుపాడు, జగిత్యాల న్యూస్టుడే: పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం మహాత్మా జ్యోతిబా ఫులె బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తేల్చారు.మల్యాల సర్కిల్లో ఓ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు కొవిడ్ సోకింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థినులు కరోనా బారినపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్