తెలంగాణలో పరిశ్రమ స్థాపించండి
ప్రసిద్ధ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్ అని సమాధానమిచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్కు కేటీఆర్ ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమను స్థాపించాలని ప్రపంచ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధినేత ఎలన్మస్క్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. భారత్లో సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ట్విటర్ ద్వారా కోరారు. భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తెచ్చేందుకు సవాళ్లున్నాయని ఎలన్మస్క్ శనివారం చేసిన ట్వీట్పై ఆయన ఈ మేరకు స్పందించారు. టెస్లాతో కలిసి పనిచేయడం తమకు సంతోషదాయకమన్నారు. భారత్లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా కారును స్వయంగా నడిపిన ఫొటోను కేటీఆర్ తన ట్వీట్కు జత చేశారు. కారు బాగుందని, ఎలన్ మస్క్ కొత్తగా ఆలోచించారని అప్పట్లో చేసిన ట్వీట్ను సైతం ఆయన గుర్తు చేశారు. కాగా కేటీఆర్ ఆహ్వానంపై ఎలన్ స్పందించారు. కేంద్రంతో ఇంకా చర్చిస్తున్నామని, చర్చలు కొలిక్కి రాలేదంటూ ఆయన పేర్కొన్నారు. 2003లో టెక్సాస్లో ప్రారంభమైన టెస్లా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల తయారీలో మొదటిస్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో 23 శాతం ఇవి తయారు చేస్తున్నవే. భారత్లో తమ తొలి యూనిట్ను స్థాపించేందుకు గత ఏడాది కాలంగా ఎలన్ సన్నాహాలు చేస్తున్నారు.
ఫార్ములా ఇ-రేస్ల నిర్వహణపై నేడు ఒప్పందం
తెలంగాణలో ఎలక్ట్రానిక్ వాహనాలతో ఫార్ములా రేస్ జాతీయస్థాయి వార్షిక పోటీల నిర్వహణకు హైదరాబాద్ వేదిక కానుంది. దీని కోసం ఫార్ములా ఇ-అసోసియేషన్తో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది.
మరో మూడు రాష్ట్రాలూ ఆహ్వానించాయ్..
చండీగఢ్: విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల నేతలూ ఎలన్ మస్క్ను ఆహ్వానించారు. తాను ప్రతిపాదిస్తున్న ‘పంజాబ్ నమూనా’లో లూధియానా నగరం విద్యుత్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమకు హబ్గా ఎదుగుతుందని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావాలని మస్క్ను కోరారు. మహారాష్ట్రలో టెస్లా కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే పూర్తి తోడ్పాటు అందిస్తామని ఆ రాష్ట్ర మంత్రి జయంత్ పటేల్ హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ గులాం రబ్బానీ కూడా మస్క్కు ఇదే రకమైన ఆహ్వానాన్ని అందించారు.
ప్రపంచంలో అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం ఎక్కడుంది?
ప్రసిద్ధ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన అతిపెద్ద ప్రాంగణం ఎక్కడుందో తెలుసా? అని కేటీఆర్ ఆదివారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్లోని ప్రాంగణ భారీ భవనం ఫోటోను ట్విటర్కు జత చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించి.. హైదరాబాద్ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో 15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా బయట అమెజాన్ ఏర్పాటు చేసిన ప్రాంగణం ఇదే కావడం గమనార్హం. ఇటీవల పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి సైతం కేటీఆర్ ఇలాంటి ప్రశ్న వేసి సమాధానం రాబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..