ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఏర్పాటుపై అసంతృప్తి సెగలు
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తులు రేగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొత్త ఆకాంక్షలు బయటపడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి.
జిల్లా కేంద్రాలను మార్చాలని డిమాండ్లు
పేర్లు పెట్టిన తీరుపైనా అభ్యంతరాలు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో కొన్నిచోట్ల నిరసనలు, అసంతృప్తులు రేగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొత్త ఆకాంక్షలు బయటపడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సకల సౌకర్యాలు, అందరికీ అందుబాటు... ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరేచోట్ల జిల్లాకేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. కొన్ని జిల్లాల పేర్లపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై విద్యార్థులు, సాధారణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమన్నారు. ప్రస్తుత కడప జిల్లాలో... రాజంపేటను కాదని రాయచోటిని జిల్లాకేంద్రం చేయడంపై అక్కడి నాయకులు పార్టీలకు అతీతంగా మండిపడ్డారు. పురపాలక సంఘ కార్యవర్గం మొత్తం రాజీనామాకు సిద్ధపడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లాకేంద్రంగా చేయకుండా రాయచోటిలో కలపడమేంటని ఆ ప్రాంతంలో నిరసన మంటలు చెలరేగాయి. విజయవాడలో కలిసిపోయిన పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటయ్యే కృష్ణాజిల్లాలో కలపడంపై ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న శృంగవరపుకోటను విజయనగరంలో కలపడం, నర్సీపట్నాన్ని చేయకపోవడంపై ఆయా ప్రాంతాల్లో అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. అధికారపక్ష ప్రజాప్రతినిధులు సైతం ఈ రెండింటి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజన ప్రభావం విశాఖపట్నం నగర పరిధిలోని పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలపై ఎక్కువగానే కనిపిస్తోంది. తిరుపతి కేంద్రంగా తలపెట్టిన జిల్లాకు శ్రీబాలాజీ కాకుండా తిరుపతిగానే పేరు ఉంచాలన్న డిమాండు ఉంది. దగ్గర్లో ఉన్న ఒంగోలును కాదని.. అద్దంకి నియోజకవర్గాన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలపడాన్ని అక్కడి వైకాపా నేతలు వ్యతిరేకించారు. శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్నే కేంద్రంగా చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండుచేశారు. ‘ఎన్టీఆర్’ జిల్లాను స్వాగతిస్తున్నట్లు నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇది తెలుగువాళ్లు గర్వపడే నిర్ణయమన్నారు.
శాస్త్రీయంగా వ్యవహరించాం
కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్ విలేకర్లతో మాట్లాడారు. జిల్లాల్ని విభజించేటప్పుడు దూరం, భౌగోళిక విస్తీర్ణం, జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నామన్నారు. దీంతోపాటు అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండేలా చూసేందుకు కొన్నిచోట్ల దూరాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. కొత్త జిల్లాల్లో ఒక కలెక్టర్, ఒక జేసీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాల పేర్లపై వచ్చే వినతులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM