‘అన్నారం’ రెండో పంపు అందుబాటులోకి..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్నారం (సరస్వతి) పంప్హౌస్లో రెండో పంపు నుంచి విజయవంతంగా నీటిని ఎత్తిపోశారు.
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్నారం (సరస్వతి) పంప్హౌస్లో రెండో పంపు నుంచి విజయవంతంగా నీటిని ఎత్తిపోశారు. ఈమేరకు సోమవారం అర్ధరాత్రి పునరుద్ధరణ పూర్తిచేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజెపడుగు వద్ద ఉన్న ఈ పంప్హౌస్ జులై వరదల్లో మునిగింది. వరద నీటిని తోడివేశాక మోటార్లను ఆరబెట్టి పంపులను పునరుద్ధరిస్తూ వస్తున్నారు. ఈ నెల 8న మొదటి పంపును నడిపించారు. తాజాగా రెండోపంపు అందుబాటులోకి వచ్చింది. వచ్చేనెల మొదటి వారంలోపు మిగిలిన పంపులను కూడా నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ యాదగిరి, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఉపేందర్, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. సాగునీటి ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ఇంజినీర్ ఇన్చీఫ్ నల్ల వెంకటేశ్వర్లు, ఇతరఇంజినీర్లు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM