LS Polls: ‘లోక్సభ’ బరిలో ఉజ్వల్ నికమ్.. భాజపా టికెట్ ఖరారు
ముంబయి నార్త్ సెంట్రల్ స్థానం నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను భాజపా లోక్సభ ఎన్నికల బరిలోకి దించింది.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections)గానూ మరో అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. మహారాష్ట్రలోని ముంబయి నార్త్ సెంట్రల్ స్థానంలో వరుసగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ (Poonam Mahajan)ను ఈసారి పక్కనపెట్టి.. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) పేరును ప్రకటించింది. పూనమ్ తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ఆయనే వాదించారు. కాంగ్రెస్ (Congress) ఇప్పటికే ధారావీ ఎమ్మెల్యే వర్ష ఏక్నాథ్ గైక్వాడ్ను ఇక్కడినుంచి పోటీలో దించింది. అదేవిధంగా.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితానూ భాజపా శనివారం విడుదల చేసింది.
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
1993 ముంబయి బాంబు పేలుళ్లు, టి-సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు, 2008 ముంబయి దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఉజ్వల్ నికమ్ అలుపెరగకుండా శ్రమించారు. 2013 ముంబయి గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్దీ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్గా పని చేశారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2017లో ఉజ్వల్ నికమ్ బయోపిక్.. ‘ఆదేశ్- ది పవర్ ఆఫ్ లా’ అనే పేరుతో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఇదిలాఉండగా.. లోక్సభ ఎన్నికల ఐదో విడతలో భాగంగా మే 20న ముంబయి నార్త్ సెంట్రల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు!
ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. -
యోగి పర్యటనలో బుల్డోజర్ల బ్రేక్డ్యాన్స్..
ఉత్తర్ప్రదేశ్లో ఓ ర్యాలీలో బుల్డోజర్లు నృత్యం చేశాయి. ఫరూఖాబాద్ లోక్సభ స్థానం అలీగంజ్లో బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. -
రాహుల్ సలహాదారు భారత విభజన గురించి మాట్లాడుతున్నారు
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన ‘వివాదాస్పద’ వ్యాఖ్యలను భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఖండించారు. -
లోక్సభ ఎన్నికలపై మోదీ, రాహుల్ డిబేట్!
లోక్సభ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీల నడుమ బహిరంగ చర్చ జరగాలని ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎ.పి.షా అభిప్రాయపడ్డారు. -
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాపై ప్రతికూల ప్రభావం!
దేశ జనాభాలో హిందువుల వాటా తగ్గి, ముస్లింల శాతం పెరిగిందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. -
బూత్ల వారీగా పోలైన ఓట్లు వెబ్సైట్లో ప్రచురించాలి
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన మూడు దశల పోలింగులో బూత్ల వారీగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను ఈసీ వెబ్సైటులో ప్రచురించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పదవీ విరమణ పొందిన సివిల్ సర్వెంట్లు డిమాండ్ చేశారు. -
మోదీ మరోసారి ప్రధాని కాలేరు
లోక్సభ ఎన్నికలు క్రమంగా ప్రధాని నరేంద్రమోదీ చేజారిపోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశ యువత దృష్టిని మళ్లించడానికి రాబోయే నాలుగైదు రోజుల్లో ఆయనొక కొత్త డ్రామా చేసేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. -
అయోధ్యకు తాళం పచ్చి అబద్ధం
కేంద్రంలో ఇండియా కూటమి నెగ్గితే అయోధ్యలో రామాలయానికి ‘బాబ్రీ తాళం’ పడుతుందని ప్రధాని చెబుతుండటం పచ్చి అబద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఖండించారు. -
ఆయన కుమారుడిని కానందువల్లే రాజకీయ అవకాశాలు రాలేదు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ- శరత్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ కుమారుడిని కానందువల్లే తనకు గతంలో రాజకీయ అవకాశాలు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. -
ఝార్ఖండ్ అంటే అవినీతి.. అరాచకం
నిలువెల్లా అవినీతి, అరాచకాలకు మారుపేరుగా ఝార్ఖండ్ నిలుస్తోంది. దీనివల్ల వలసలు పెరిగిపోతున్నాయి. ఖనిజాలకు నిలయమైనా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే వాతావరణం లేదు. -
భాజపా టికెట్ వదులుకుని.. సొంత కూటమి అభ్యర్థిపై పోటీకి సై!
భాజపా కేటాయించిన టికెట్ను వదులుకున్న ప్రముఖ భోజ్పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ తాజాగా బిహార్లోని కారాకాట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టోపై భాజపా దుష్ప్రచారం - ప్రియాంకాగాంధీ
వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు భాజపా నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ విమర్శించారు. -
పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు.. దృశ్యాలు వైరల్
Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో.. ఓ బాలుడు ఓటు వేసిన ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
మోదీ రోడ్ షో చేసినా, ఎయిర్ షో చేసినా ఏమీ మారదు: తేజస్వీ యాదవ్
దేశంలో హిందువుల జనాభా తగ్గి ముస్లిం జనాభా పెరుగుతున్నట్లు ‘ఈఏసీ-పీఎం’ ఇచ్చిన నివేదికపై తేజస్వీ యాదవ్ ప్రశ్నలు లేవనెత్తారు. -
యోగి పర్యటనలో బుల్డోజర్ల బ్రేక్డ్యాన్స్..!
యూపీలో జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లతో డ్యాన్స్లు వేయించారు. చివరికి ఎమ్మెల్యే జోక్యం చేసుకొని మందలించడంతో వాటిని ఆపారు. -
72 ఏళ్లలో ముగ్గురు మహిళలే లోక్సభకు
హిమాచల్ప్రదేశ్ నుంచి గత 72 సంవత్సరాలలో ముగ్గురు మహిళలు మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు. -
రాహుల్ ఇటలీకి పోవాల్సిందే.. కేంద్ర హోంమంత్రి అమిత్షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్బరేలీలో ఓడిపోవడం ఖాయం. స్థిరపడడానికి ఆ తర్వాత ఇటలీ వెళ్లాల్సిందే. -
అయిదో దశ బరిలో 695 మంది అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికల అయిదో విడతలో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. -
మూడోవిడతలో 65.68% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో మొత్తంగా 65.68% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. -
అదానీ, అంబానీపైకి ఈడీని పంపండి
పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలు తమ పార్టీకి టెంపోలో నల్లధనాన్ని పంపారో లేదో అన్న విషయమై దర్యాప్తునకు సీబీఐ లేదా ఈడీలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాలు విసిరారు. -
పోలింగు నమోదుపై స్పష్టతకు నేడు ఈసీతో విపక్ష నేతల భేటీ
లోక్సభ ఎన్నికల పోలింగు ప్రతి దశలోనూ వాస్తవ గణాంకాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్న విపక్ష ఇండియా కూటమి నేతలు గురువారం ఎన్నికల సంఘాన్ని కలుసుకొని ఆ మేరకు విన్నవించనున్నారు.
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం