భాజపా అభ్యర్థితో ఆలింగనం.. ఏఎస్సైపై క్రమశిక్షణా చర్యలు

సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న ఉమాదేవిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ నగర కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 23 Apr 2024 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న ఉమాదేవిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ నగర కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల క్రితం యాకుత్‌పుర నియోజకవర్గం లక్ష్మీనగర్‌ కాలనీలో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మాధవీలత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న ఉమాదేవి.. మాధవీలతతో కరచాలనం చేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఎన్నికల నియామవళి విరుద్ధంగా వ్యవహరించడం.. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. తీవ్రంగా పరిగణించిన కమిషనర్‌ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. ఉమాదేవిని సస్పెండ్‌ చేసినట్లు ప్రచారం జరిగినా.. అధికారులు నిర్ధారించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని