Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్ జంగ్ సైరన్
ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను...
రేవంత్రెడ్డి సహా ముఖ్య నేతల గృహ నిర్బంధం
వలయాలను ఛేదించుకుని ఎల్బీనగర్ చేరిన కార్యకర్తలు
లాఠీఛార్జిలో పలువురికి గాయాలు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పీసీసీ పిలుపు
ఈనాడు, హైదరాబాద్- న్యూస్టుడే, జూబ్లీహిల్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, నాగోలు, గాంధీభవన్: ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ తలపెట్టింది. తొలి కార్యక్రమంగా శనివారం దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ నుంచి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వరకు ర్యాలీకి పీసీసీ పిలుపునిచ్చింది. దిల్సుఖ్నగర్ కూడలిలో భారీ బందోబస్తు కారణంగా.. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. కొత్తపేటలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సరూర్నగర్వైపు మళ్లించారు. కాంగ్రెస్ నాయకులు మెట్రో రైళ్లలో వచ్చే అవకాశం ఉందని భావించి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ను పూర్తిగా మూసివేశారు. అయినప్పటికీ కొందరు విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు, బారికేడ్లను దాటుకుని సాయంత్రానికి భారీసంఖ్యలో కాంగ్రెస్, యూత్కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, నాయకులు ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకున్నారు. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. మల్లు రవి కిందపడ్డారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ సహా పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రేవంత్ ఇంటి వద్దా తోపులాట
గాంధీభవన్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి జూబ్లీహిల్స్లోని ఇంటికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జంగ్ సైరన్ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇంటి వద్దనే బైఠాయించి రేవంత్ నిరసన తెలిపారు. ఆయనకు మాజీ మంత్రి షబ్బీర్అలీ వచ్చి మద్దతు పలికారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులనూ గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్, గాంధీ విగ్రహాల ఎదుట కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మల దహనానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
రాష్ట్రంలో దుర్మార్గ పాలన: రేవంత్రెడ్డి
రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. గృహనిర్బంధం సందర్భంగా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఏడాదికి పదివేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నా ఎందుకు భర్తీ చేయడం లేదో.. ఫీజు రీఇంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. శ్రీకాంతాచారి త్యాగ పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడిగా వర్ణించారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్, కేటీఆర్లు శత్రువులు, తీవ్రవాదులుగా భావిస్తున్నారని ఆరోపించారు. తమ తొలి అడుగును అడ్డుకున్నప్పటికీ.. మలి అడుగు పాలమూరులో వేయబోతున్నామని చెప్పారు. ఆ రోజు అడ్డుకోవాలని చూస్తే తమ తడాఖా చూపిస్తామన్నారు. గాంధీజీ స్ఫూర్తితోనే శనివారం మౌనంగా ఉన్నామన్నారు.
* పోలీసుల తీరును నిరసిస్తూ ఎల్బీనగర్ వద్ద మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మాచిరాజుపల్లికి చెందిన విద్యార్థి దిల్లీ కల్యాణ్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కార్యకర్తలు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. సరూర్నగర్ స్టేడియం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కార్యక్రమాల్లో నేతలు మధుయాస్కీ, సంపత్, దాసోజు, మహేశ్కుమార్గౌడ్, మహేశ్వర్రెడ్డి, బి.వి.శ్రీనివాస్, శివసేనారెడ్డి, రితీష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు