రాకెట్ దాడుల మధ్య నుంచి ప్రయాణికుల విమానం: భయానక వీడియో వైరల్
Israel Hamas: భారీస్థాయిలో వైమానిక దాడులు జరుగుతోన్న సమయంలో ఓ ప్రయాణికుల విమానం ఇజ్రాయెల్ చేరుకుంది. ఆ పేలుళ్ల మధ్య నుంచే గమ్యస్థానం వైపు వెళ్లింది. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ గగనతలంలో ప్రయాణికుల విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ప్రయాణిస్తోన్న సమయంలో సరిగ్గా ఆ దగ్గర్లోనే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్(Iron Dome) రాకెట్లను పేల్చివేసింది. కొద్దిగా అటూ ఇటూ అయినా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసేవే..! ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. (Israel Hamas conflict)
ఆ ప్రయాణికుల విమానం ఇజ్రాయెల్(Israel) నగరం టెల్అవీవ్లో దిగేందుకు వెళ్తోంది. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు రాకెట్లను ఎదుర్కొంటోంది. వాటిని పేల్చివేస్తోంది. వైరల్గా మారిన దృశ్యాల్లో.. విమానానికి, భారీ పేలుళ్లకు పెద్దగా దూరం లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జార్జియా నుంచి వచ్చిన ఆ విమానం షెడ్యూల్ సమయం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా టెల్అవీవ్లో ల్యాండ్ అయింది. భారీస్థాయిలో వైమానిక దాడులు జరుగుతోన్న సమయంలో అది ఇజ్రాయెల్ చేరుకుంది. ఈ ఘటనపై విమానాశ్రయం నుంచి కానీ, విమానయాన సంస్థ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు.
సంక్షోభం వేళ ఇజ్రాయెల్లో కార్మికుల కొరత.. భారత్ నుంచి లక్ష మంది?
ఇదిలా ఉంటే.. అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో ఇజ్రాయెల్పై ఉగ్రదాడి కి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హమాస్ ఏడువేలకు పైగా రాకెట్లను ప్రయోగించిందని సమాచారం. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ (Iron dome Defence System)ను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాని ప్రయాణతీరును అంచనా వేస్తాయి. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్లను అడ్డుకుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!