USA vs China: అమెరికా ముంగిట చైనా గూఢచర్యం.. క్యూబాలో డ్రాగన్ వేగులు..!
అమెరికాకు అత్యంత సమీపంలో చైనా ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. క్యూబా, చైనా సర్కార్లు వీటిపై మండిపడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: గూఢచర్యంపై అమెరికా (USA)- చైనా(China) మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబా(Cuba)లో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు బాంబు పేల్చారు. దీని ఆధారంగా అక్కడి పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో ట్రంప్ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని వాటిల్లో పేర్కొన్నాయి. ‘‘2019లో క్యూబాలోని ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థలను చైనా అప్గ్రేడ్ చేసింది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి ఇంటెలిజెన్స్ రికార్డు(అమెరికా)ల్లో పక్కాగా ఉన్నాయి’’ అని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు సిగ్నల్ ఇంటెలిజెన్స్ను సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అంగీకరించింది. దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించేందుకు చైనాకు అవకాశం లభించింది. ఈ విషయాన్ని వాల్స్ట్రీట్ జర్నల్ కథనంలో కూడా పేర్కొంది. దీంతో బైడెన్ సర్కారుపై విమర్శలు చెలరేగే పరిస్థితి నెలకొంది.
దీనిపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కెర్బీ భిన్నంగా స్పందిస్తూ ఈ నివేదికలు పూర్తిగా కచ్చితమైనవి కావు. ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే. ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడంలేదు’’ అని పేర్కొన్నారు. చైనా ఇంటెలిజెన్స్ సర్వీసులు సముద్ర ట్రాఫిక్పై నిఘాపెట్టడం, అమెరికాకు చెందిన గ్వాంటనామో నౌకా స్థావరంలో కదలికలు గమనించడం, కమ్యూనికేషన్లపై దృష్టిపెట్టడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. మరోవైపు క్యూబా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ కార్లోస్ ఫెర్నాండో డి కాసియో కూడా అమెరికా పత్రికల కథనాలను ఖండించారు. ఎటువంటి ఆధారాలు సమర్పించకుండానే అమెరికా పత్రికలు ఇటువంటి కథనాలను వ్యాప్తి చేస్తున్నాయన్నారు. కనీసం నియమాలను కూడా పాటించడంలేదన్నారు.
మరోవైపు ఈ కథనాలపై చైనా కూడా స్పందించింది. క్యూబా అంతర్గత వ్యహారాల్లో అమెరికా జోక్యంపై హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందిస్తూ అక్కడి పరిస్థితి తెలియదని తొలుత చెప్పారు. ‘‘వదంతలు, అపవాదులను వ్యాప్తి చేయడం అమెరికా శైలి ఇష్టానుసారంగా పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం దానికి పేటెంట్’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!