Donald Trump: అణు యుద్ధం రావొచ్చు
ప్రపంచంలోని కొన్ని ధూర్త దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నాయని, ప్రతి ఒక్కరూ అణు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని, బైడెన్ అసమర్థతవల్లే ఇదంతా జరుగుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు.
ప్రతి ఒక్కరూ అణు దాడి చేస్తామని బెదిరిస్తున్నారు
నేనుంటే ఉక్రెయిన్పై దాడి జరిగేదే కాదు
బైడెన్ అసమర్థతవల్లే ఇదంతా..
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది
అరెస్టయి, విడుదలైన అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు
34 అభియోగాలను మోపిన కోర్టు
తాను నేరం చేయలేదని ట్రంప్ వాదన
వాషింగ్టన్: ప్రపంచంలోని కొన్ని ధూర్త దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టుకడుతున్నాయని, ప్రతి ఒక్కరూ అణు దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని, బైడెన్ అసమర్థతవల్లే ఇదంతా జరుగుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ అణు యుద్ధం తప్పదని హెచ్చరించారు. తన హయాంలో అణ్వస్త్రాలపై మాట్లాడేందుకే చాలా దేశాలు భయపడేవని, ఇప్పుడు అందరూ హెచ్చరిస్తున్నారని తెలిపారు. ‘మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదు. కరెన్సీ విలువ పడిపోతోంది. చైనాతో రష్యా, ఇరాన్తో సౌదీ అరేబియా జతకట్టాయి. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా జట్టుకట్టి విధ్వంసకర ప్రయత్నాలు చేస్తున్నాయి. నేను అధ్యక్షుడిగా ఉంటే ఇవన్నీ జరిగేవి కావు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న డెమోక్రాట్లు అమెరికా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని, విఫల దేశంగా మార్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ఉన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శృంగార తారతో అక్రమ సంబంధం బయటపడకుండా ఉండేందుకు రహస్య ఆర్థిక ఒప్పందం చేసుకున్న కేసులో ట్రంప్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి న్యూయార్క్లోని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనపై నమోదైన 34 నేరాభియోగాలను చదివి వినిపించారు. వాటిని ట్రంప్ తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా చేరుకున్నారు. అక్కడి మారెలాగో రిసార్టులో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘నేను చేసిన తప్పేంటంటే.. దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిని ధైర్యంగా అడ్డుకోవడమే. మన దేశం నరకంలోకి వెళ్తోంది. నేను శ్వేతసౌధం నుంచి బయటకు రావడం దేశ చరిత్రలోనే అత్యంత ఇబ్బందికర పరిణామం. మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా మనం తీర్చిదిద్దుదాం. నామీద ఏ కేసూ లేకపోయినా కోర్టును మన్హటన్ అటార్నీ ప్రభావితం చేశారు. గ్రాండ్ జ్యూరీ పత్రాలను కావాలనే అటార్నీ లీక్ చేశారు. నా కేసులో నకిలీ దర్యాప్తు జరుగుతోంది. అయినా మీకందరికీ హామీ ఇస్తున్నా. దేశాన్ని రక్షించే విషయంలో నన్ను వారు దెబ్బతీయలేరు. ఆపలేరు. న్యాయమూర్తి జువాన్ మెర్చన్ నాకు వ్యతిరేకి. ఆయన కుమార్తె.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కోసం పని చేస్తున్నారు. బైడెన్-హ్యారిస్ దగ్గర డబ్బులు తీసుకుని నామీద అభియోగాలను న్యాయమూర్తి మోపారు’ అని ట్రంప్ ధ్వజమెత్తారు.
తదుపరి హాజరు డిసెంబరులో..
నేరాభియోగాలు నమోదైన కేసులో మళ్లీ డిసెంబరు 4వ తేదీన ట్రంప్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రాసిక్యూటర్లు దర్యాప్తులో కనుగొన్న అంశాలను 65 రోజుల్లో కోర్టుకు సమర్పిస్తారు. ఆగస్టు 8వ తేదీలోగా ట్రంప్ న్యాయవాదులు డిస్మిస్ పిటిషన్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 19వ తేదీలోగా ప్రాసిక్యూటర్లు వాటిపై సమాధానమివ్వాల్సి ఉంటుంది. తదుపరి ట్రంప్ విచారణకు హాజరయ్యే డిసెంబరు 4న వాటిపై న్యాయమూర్తి మెర్చన్ నిర్ణయం తీసుకుంటారు.
‘క్షమాభిక్ష వర్తించదు’
ట్రంప్ కేసు 2024 ఎన్నికలయ్యేంత వరకూ తేలే అవకాశం లేదని ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా అభిప్రాయపడ్డారు. ‘అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తికి లభించే క్షమాభిక్ష’ కూడా ఈ కేసులో వర్తించదని స్పష్టం చేశారు. రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ పాల్గొనేందుకు వీలుగా కేసును త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని, డిసెంబరు కంటే ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడతామని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్న నేపథ్యంలో బాత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 76ఏళ్ల ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రిపబ్లికన్ ప్రైమరీలు ప్రారంభమవుతాయి. ‘ఈ కేసులో రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం విచారణ జరగడం అసాధారణమేమీ కాదు. 2024 వేసవికల్లా ట్రయల్కు రావడం అసంభవం. అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబరు నాటికీ రాకపోవచ్చు’ అని బాత్రా వివరించారు.
ఆరుసార్లే మాట్లాడిన ట్రంప్
న్యూయార్క్: కోర్టు హాలులో ట్రంప్ కేవలం ఆరుసార్లే మాట్లాడారు. తాను దోషిని కాదని చెప్పడంతోపాటు మరో ఐదుసార్లే స్పందించారు. సుమారు గంటపాటు కోర్టు విచారణ సాగింది. న్యాయమూర్తి అడిగిన వాటికి అవును.. కాదు అని మాత్రమే సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు