తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.
ఊళ్లో లేకుండా చేస్తామని హెచ్చరికలు
పోలింగ్నాడు సొంతూరిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడి దాష్టీకం
గ్రామానికి తాగునీరు, విద్యుత్ సరఫరా బంద్
ఊరు వదిలి వెళ్లి తలదాచుకున్న బాధితులు
ఈనాడు, ఈనాడు డిజిటల్-నరసరావుపేట: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికలను ఏకపక్షంగా జరుపుకునేందుకు తెదేపాకు పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నవారిని బెదిరించారు. వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. చివరికి మహిళలనే కనికరం కూడా లేకుండా చేయిచేసుకున్నారు. గ్రామానికి నీళ్లూ, కరెంటూ తీసేశారు. వీరి ఆగడాలను తట్టుకోలేక అనేకమంది తెదేపా సానుభూతిపరులు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ దారుణాలు పోలింగ్ రోజున జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి సొంత ఊరైన వెల్దుర్తి మండలం కండ్లకుంటలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా తెదేపాతోపాటు ఇతర పార్టీలకు చెందిన 12 మంది పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వైకాపా ఏజెంట్లు తెదేపా తరఫున కూర్చున్న దుర్గంపూడి వెంకటరెడ్డి, మాణిక్యంను బయటకు వెళ్లిపొమ్మని బెదిరించారు.
కొందరు వెళ్లిపోగా ఈ ఇద్దరు మాత్రం వెరవకుండా కూర్చున్నారు. ఏకపక్షంగా పోలింగ్ సాగాలని పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి ముందురోజే వెబ్కాస్టింగ్ వైర్లు కత్తిరించేశారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా బంద్ చేయించారు. ఇంత చేసినా తెదేపా ఏజెంట్లు ధైర్యంగా, పట్టుదలతో కూర్చున్నారు. ఇది చూసిన వెంకట్రామిరెడ్డి మాకే ఎదురుచెబుతారా.. మీ సంగతి చూస్తాం.. ఊరిలో ఉండనివ్వం.. అంటూ బెదిరించి.. ఆతరువాత ఏజెంట్ల ఇళ్లకు అనుచరులతో వెళ్లి వారి కుటుంబసభ్యులపై కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డారు. వాళ్లు హాహాకారాలు చేస్తుండగా దుర్గంపూడి వెంకటరెడ్డి కుమారులు అంజిరెడ్డి, దిలీప్రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చారు.ఆ సమయంలో ఎస్సీ కాలనీ వైపు నుంచి వెంకట్రామిరెడ్డి అనుచరులు వీరిపైకి దూసుకొచ్చారు. ‘వీళ్ల నాన్న ఏజెంట్గా కూర్చున్నాడు. వీరిని కూడా చావబాదండి’ అంటూ ఆయన తన అనుచరులను రెచ్చగొట్టారు. అన్నదమ్ములను కొడుతున్న దృశ్యాలను వెంకటరెడ్డి కుమార్తె శివాంజలి సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఆమె చెంపపై కొట్టి సెల్ఫోన్ లాక్కొని వెంకట్రామిరెడ్డి పగలగొట్టారు. అంజిరెడ్డి, దిలీప్రెడ్డిని కొడుతుండగా తప్పించుకుని వారు ఇంట్లోకి వెళ్లి దాక్కోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
డీఎస్పీకి ఫిర్యాదు చేశారని..
ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న అంజిరెడ్డి డీఎస్పీకి ఫోన్ చేసి తమపై వైకాపా వారు దాడులకు పాల్పడుతున్నారని వచ్చి రక్షించాలని కోరారు. డీఎస్పీ వస్తున్నానని చెప్పారు. దాడి తర్వాత వెంకటరెడ్డి భార్య లక్ష్మి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి భర్తకు పిల్లలను కొట్టిన విషయం చెప్పారు. తరువాత ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈలోగా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మరోసారి వెంకటరెడ్డి ఇంటిపైకి దాడికి వచ్చారు. వస్తూ వస్తూనే డీఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తార్రా? ఏజెంట్లుగా కూర్చునే దమ్ముందారా మీకు? ఊళ్లో లేకుండా చేస్తాం.. ఏమనుకుంటున్నారో అంటూ కర్రలతో వెంకటరెడ్డి కుమారులు అంజిరెడ్డి, దిలీప్రెడ్డిల తలలు పగలగొట్టారు. దీంతో స్పృహతప్పి పడిపోయారు.
అంబులెన్స్ను అడ్డుకుని..
అన్నదమ్ములు ఇద్దరూ దాడిలో గాయపడి స్పృహతప్పి పడిపోవడంతో వారి సోదరి శివాంజలి 108కి ఫోన్ చేసింది. గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్ను వెంకటరెడ్డి ఇంటివద్దకు వెళ్లకుండా వైకాపా మూకలు గంటపాటు అడ్డగించాయి. గంట తర్వాత మరో వీధి గుండా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
భయంతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయి..
గాయపడినవారిని కండ్లకుంట గ్రామం నుంచి అంబులెన్స్లో నరసరావుపేట ఆసుపత్రికి తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. అయితే ఆసుపత్రిలో ఉన్నవారిపై మళ్లీ దాడి చేయిస్తారన్న సమాచారంతో అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి తలదాచుకున్నారు. అంజిరెడ్డి, దిలీప్రెడ్డి, తల్లి లక్ష్మి అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఘటన తర్వాత వెంకటరెడ్డి కొందరి సాయంతో వెల్దుర్తికి చేరుకుని అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. కుమార్తె శివాంజలి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఇలా ఐదుగురు కుటుంబసభ్యులూ వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైకాపా మూకలు వెంకటరెడ్డి కుటుంబానికి చెందిన 10 బర్రెలను గొలుసులు తప్పించి ఎక్కడికో తరిమేశారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కండ్లకుంట ఎస్సీ కాలనీలో తెదేపా సానుభూతిపరుల నివాసాలు ఉన్నాయి. ఇక్కడినుంచి కొందరు గ్రామం వదిలివెళ్లిపోయారు.గ్రామంలో విద్యుత్తు సరఫరా బంద్ చేశారు. తాగునీటి కనెక్షన్ను కూడా పీకేశారు. కనీసం ఆర్వోప్లాంట్కు వెళ్లి నీరు తెచ్చుకుందామన్నా కూడా ఇవ్వడం లేదు. ఊళ్లో నుంచి వెళ్లగొట్టేలా ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
డీఎస్పీకి ఫోన్ చేసిన విషయం వారికి ఎలా తెలిసింది?
కండ్లకుంటలో వైకాపా మూకలు దాడి చేసిన విషయాన్ని అంజిరెడ్డి ఫోన్ ద్వారా ఓ డీఎస్పీకి చెబితే ఆ సమాచారం నిమిషాల వ్యవధిలోనే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్పీకి ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి దాడి చేయడం గమనార్హం. ఇంట్లో తలుపులు వేసుకుని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం వైకాపా వారికి తెలిసిందంటే తమకు ఇక భద్రత లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
వలసపోయిన నేతలు
మాచర్ల నియోజకవర్గంలో తెదేపా తరఫున కీలకంగా పనిచేసిన నేతలంతా దాడులు జరుగుతాయన్న భయంతో ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరైతే హైదరాబాద్, గుంటూరు తదితర నగరాలకు వెళ్లిపోయారు. మాచర్ల పట్టణం ప్రస్తుతానికి పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ తెదేపా నేతల భద్రతకు భరోసా లేకపోవడంతో వారు అక్కడ ఉండటానికి సాహసించడం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం