ఆ రాజ కిరీటం వెనుక..
ఛార్లెస్-3 పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న బ్రిటిష్ రాజ కిరీటం, సింహాసనం వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగుంది.
రాజును చంపి.. కరిగించేసి
విడాకుల కోసం పోప్పైనే తిరుగుబాటు
ఇంగ్లాండ్ రాచపీఠం వివాదాలమయం
ఛార్లెస్-3 పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న బ్రిటిష్ రాజ కిరీటం, సింహాసనం వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగుంది. అంతే కాదు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న అనేక వివాదాలకు ఈ కిరీటం, సింహాసనం ప్రత్యక్ష సాక్షులు. ప్రస్తుతం ఛార్లెస్-3 ధరించబోయే రాజ కిరీటాన్ని సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం అంటారు. 444 నవరత్నాలు, మాణిక్యాలు పొదిగి, పూర్తి బంగారంతో తయారైన దీని బరువు 2.23 కిలోలు. 1661లో దీనిని ఛార్లెస్-2 పట్టాభిషేకం కోసం తయారు చేయించారు. నిజానికి అంతకు ముందు నుంచే రాజ కిరీటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
పోప్పై తిరుగుబాటు
1042-1066 మధ్యకాలంలో పాలన సాగించిన ఆంగ్లో-సాక్సన్ ఇంగ్లిష్ రాజు ఎడ్వర్డ్ ది కన్ఫెసర్ మరణానంతరం ఆయన వాడిన కిరీటం, రాజముద్రలను ఇంగ్లాండ్ రాజులకు పట్టాభిషేక సమయంలో ధరింపజేయడం ఆనవాయితీగా మారింది. 1229లో హెన్రీ-3 పట్టాభిషేకాన్ని రికార్డుల్లో నమోదైన తొలి ఉత్సవంగా చెబుతారు. అప్పట్నుంచి ప్రతి పట్టాభిషేకంలో కీలకమైన సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం ప్రభ 1525 తర్వాత మసకబారడం మొదలైంది. రాజు హెన్రీ-8 భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాటికన్ పోప్ అంగీకారం ఉంటేనే అది సాధ్యం. పోప్ ఎటూ తేల్చకుండా నాన్చడంతో హెన్రీ-8 ఆగ్రహించి ఇంగ్లాండ్లో పోప్ అధికారాన్ని తొలగించారు. రోమన్ కాథలిక్ చర్చి బదులు చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ను స్థాపించి దానికి తననే అధిపతిగా నియమించుకున్నారు. అలా ప్రొటెస్టెంట్ చర్చి ఆధిపత్యం మొదలైంది. అదే క్రమంలో సంప్రదాయబద్ధమైన రాజ కిరీట ధారణ ప్రాధాన్యం కోల్పోయింది.
అంతర్యుద్ధంలో కరిగించేశారు
ఆ తర్వాత ఇంగ్లిష్ అంతర్యుద్ధం (1642-1652) సమయంలో రాజ కిరీటం ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. 1625లో సింహాసనాన్ని అధిష్ఠించిన ఛార్లెస్-1 హయాంలో బ్రిటన్ పార్లమెంటు, రాజ కుటుంబం మధ్య అధికార యుద్ధం సాగింది. 1642లో ఎంపీలను అరెస్టు చేయించడానికి రాజు ప్రయత్నించగా.. ఒలివర్ క్రోమ్వెల్ సారథ్యంలోని పార్లమెంటరీ సైన్యం రాజు ఛార్లెస్-1పై దాడి చేసింది. పోరాటంలో చివరకు పార్లమెంటు సభ్యులదే పైచేయి అయింది. దేశద్రోహ అభియోగంపై 1649లో రాజు ఛార్లెస్-1ను బహిరంగంగా చంపేశారు. క్రోమ్వెల్ ప్రభుత్వ హయాంలో బ్రిటన్ రాజరికపు పెత్తనాన్ని వీడి... కామన్వెల్త్ రిపబ్లిక్గా ఆవిర్భవించింది. అదే సమయంలో రాజరికానికి గుర్తులైన సెయింట్ ఎడ్వర్డ్ కిరీటంతోపాటు.. అనేక రాజముద్రలను పార్లమెంటరీ ప్రభుత్వం కరిగించింది. మరికొన్నింటిని అమ్మేసింది. 1660లో పెత్తనం లేకుండా రాజరికాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఛార్లెస్-2 పట్టాభిషేకం కోసం కొత్తగా సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని మళ్లీ తయారు చేయించారు.
ఇప్పటిదాకా ఐదుగురే..
బ్రిటిష్ అధికారిక రాజ కిరీటంగా పేరొందిన ఈ ఎడ్వర్డ్ కిరీటాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదుగురే.. ఛార్లెస్-2 (1661), జేమ్స్-2 (1685), విలియం-2 (1689), జార్జ్-5 (1910), ఎలిజబెత్-2 (1953) మాత్రమే ధరించారు. విక్టోరియా మహారాణి, ఎడ్వర్డ్-7లు బరువు ఎక్కువ ఉందనే కారణంతో ఈ కిరీటాన్ని కాకుండా తక్కువ బరువున్న మరోటి ధరించారు.
* 1689 తర్వాత 200 సంవత్సరాలపాటు ఏ పట్టాభిషేకంలోనూ దీన్ని వాడలేదు. ఐదో జార్జ్ (1910) పాలనలో ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. చివరిసారిగా 1953లో ఎలిజబెత్-2 ధరించారు. ఇప్పుడామె కుమారుడు ఛార్లెస్-3కి ఆ అవకాశం దక్కబోతోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు