Niger: సైన్యం తిరుగుబాటు.. బందీగా అధ్యక్షుడు..!
Niger: నైగర్లో ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం పడగొట్టింది. అధ్యక్షుడిని బందీగా చేసుకుని తిరుగుబాటు ప్రకటించింది.
నియామి: పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశమైన నైగర్ (Niger)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ (Mohamed Bazoum)కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు (Military Coup) చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యులు బుధవారం చుట్టుముట్టారు. బజౌమ్, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది.
ఈ తిరుగుబాటును కర్నల్ మేజర్ అమదౌ బద్రామనె ఆ దేశ జాతీయ టీవీ ఛానెల్లో ప్రకటించారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వ పాలనను ముగించాలని సైన్యం, రక్షణ, భద్రతా దళాలు నిర్ణయించాయి. దేశంలో భద్రతా పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా పేలవమైన పాలన కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని అమదౌ వెల్లడించారు.
నాకు వ్యతిరేకంగా ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యుల కుట్ర
తిరుగుబాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సైన్యం ఈ సందర్భంగా వెల్లడించింది. దేశ సరిహద్దులను కూడా తాము మూసివేసినట్లు తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను హెచ్చరించింది.
ఖండించిన ప్రపంచ దేశాలు..
నైగర్లో సైన్యం తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, అమెరికా, ఆఫ్రికా యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. సైన్యం ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తీవ్రంగా స్పందించారు. అధ్యక్షుడు బజౌమ్ను తక్షణమే విడుదల చేయాలన్నారు. మరోవైపు బజౌమ్ మద్దతుదారులు అధ్యక్ష భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు వారిని అడ్డుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు.
1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత నుంచి నైగర్లో అనేకసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారి రెండేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో బజౌమ్ విజయం సాధించి.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్స్, పశ్చిమ దేశాలకు ఈయన సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పదవీచ్యుతుడిని చేయడానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు కుట్రలు జరగడం గమనార్హం.
మరోవైపు ఇస్లామిక్ చొరబాటుదారులతో సతమతమవుతున్న నైగర్లో అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ముఠాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో అధ్యక్షుడు బజౌమ్ పశ్చిమ దేశాలకు సహకారం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు