Niger: సైన్యం తిరుగుబాటు.. బందీగా అధ్యక్షుడు..!
Niger: నైగర్లో ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం పడగొట్టింది. అధ్యక్షుడిని బందీగా చేసుకుని తిరుగుబాటు ప్రకటించింది.
నియామి: పశ్చిమ ఆఫ్రికా (West Africa) దేశమైన నైగర్ (Niger)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ (Mohamed Bazoum)కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటు (Military Coup) చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యులు బుధవారం చుట్టుముట్టారు. బజౌమ్, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది.
ఈ తిరుగుబాటును కర్నల్ మేజర్ అమదౌ బద్రామనె ఆ దేశ జాతీయ టీవీ ఛానెల్లో ప్రకటించారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వ పాలనను ముగించాలని సైన్యం, రక్షణ, భద్రతా దళాలు నిర్ణయించాయి. దేశంలో భద్రతా పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా పేలవమైన పాలన కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని అమదౌ వెల్లడించారు.
నాకు వ్యతిరేకంగా ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యుల కుట్ర
తిరుగుబాటు నేపథ్యంలో ప్రస్తుతమున్న రాజ్యాంగాన్ని రద్దు చేశామని, దేశవ్యాప్తంగా అన్ని సంస్థల కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సైన్యం ఈ సందర్భంగా వెల్లడించింది. దేశ సరిహద్దులను కూడా తాము మూసివేసినట్లు తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరులు జోక్యం చేసుకోవద్దని పశ్చిమ దేశాలను హెచ్చరించింది.
ఖండించిన ప్రపంచ దేశాలు..
నైగర్లో సైన్యం తిరుగుబాటును ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, అమెరికా, ఆఫ్రికా యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. సైన్యం ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తీవ్రంగా స్పందించారు. అధ్యక్షుడు బజౌమ్ను తక్షణమే విడుదల చేయాలన్నారు. మరోవైపు బజౌమ్ మద్దతుదారులు అధ్యక్ష భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు వారిని అడ్డుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు.
1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత నుంచి నైగర్లో అనేకసార్లు సైన్యం తిరుగుబాటు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారి రెండేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో బజౌమ్ విజయం సాధించి.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫ్రాన్స్, పశ్చిమ దేశాలకు ఈయన సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పదవీచ్యుతుడిని చేయడానికి ఇప్పటి వరకు నాలుగు సార్లు కుట్రలు జరగడం గమనార్హం.
మరోవైపు ఇస్లామిక్ చొరబాటుదారులతో సతమతమవుతున్న నైగర్లో అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ముఠాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరులో అధ్యక్షుడు బజౌమ్ పశ్చిమ దేశాలకు సహకారం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!