రష్యా చేతికి అణు సునామీ ఆయుధం..!
ప్రపంచ నౌకాదళ చరిత్రంలో గత వారం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆవిష్కారమైంది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యం ఉండగలదు.. అవసరమైతే సముద్రపు అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశ తీరప్రాంత నగరాలపైకి సునామీ వలే ప్రయోగించగలదు. అదే ‘కే-329 బెల్గోరోడ్
పశ్చిమదేశాలను భయపెడుతున్న ‘బెల్గోరోడ్’ జలాంతర్గామి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచ నౌకాదళ చరిత్రలో గత వారం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆవిష్కృతమైంది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యంగా ఉండగలదు.. అవసరమైతే సముద్రపు అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశ తీరప్రాంత నగరాలపైకి సునామీ వలే ప్రయోగించగలదు. అదే ‘కే-329 బెల్గోరోడ్’ జలాంతర్గామి. దీని రాకతో సముద్రంపై జరిగే యుద్ధాల్లో కొత్త శకం మొదలైంది. ఇటీవల రష్యాకు అత్యంత కీలకమైన కోలా ద్వీపకల్పానికి సమీపంలోని తెల్ల సముద్రంలో సెవెరోడిన్స్క్లో రష్యా అమ్ములపొదిలోకి చేరింది. 604 అడుగుల పొడవుతో ఉన్న ఈ సబ్మెరైన్ ప్రపంచంలోనే భారీదని నిపుణులు చెబుతున్నారు. గతంలో రష్యా నిర్మించిన ఆస్కార్శ్రేణి సబ్మెరైన్ పొడవును పెంచి అణు టార్పిడో పొసైడాన్ను ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు.
గతేడాదే రహస్యంగా సముద్రంలోకి..
బెల్గోరోడ్ సబ్మెరైన్ గతేడాదే రహస్యంగా తొలిసారి సముద్రంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో నల్ల సముద్రంలో ఉన్న అమెరికా, బ్రిటన్ నౌకలను దెబ్బతీస్తుందని భయపడ్డారు. కానీ, ఈ ఏడాది జనవరిలో సముద్రంలో పరీక్షలు పూర్తిచేసుకొందని రష్యా వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి జులై 31న దీనిని నౌకాదళానికి అందజేయాల్సి ఉన్నా.. రష్యా సేనలు యుద్ధంలో ఉండటంతో వాటిల్లో నైతికస్థైర్యం పెంచేందుకు మూడు వారాల ముందే కమిషన్ చేశారు. దీనిని నౌకాదళానికి అందజేసే సమయంలో రష్యా నేవీ చీఫ్ నికోలాయ్ యెమినేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సబ్మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్లకు, లోతైన ప్రదేశాల్లో రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు డీప్సీ, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ను తీసుకెళ్లగలదని వెల్లడించారు. ఈ అంశాలను విశ్లేషించిన పశ్చిమదేశాల సైనిక నిపుణులకు కొన్ని కీలక విషయాలు అర్థమయ్యాయి. ఈ సబ్మెరైన్కు అనుబంధంగా మరో చిన్న అణుశక్తి సబ్ మెరైన్ కూడా ఉంటుంది.
సముద్రంలోని అత్యంత లోతుల్లో ఉండే కేబుల్స్ను ధ్వంసం చేసేందుకు బెల్గోరోడ్ను ఉపయోగించే అవకాశాలున్నాయని గుర్తించారు. ఇదే నిజమైతే యుద్ధ సమయంలో పశ్చిమ దేశాల కమ్యూనికేషన్లను ఈ సబ్మెరైన్ తీవ్రంగా దెబ్బతీయగలదని అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ పేర్కొంది. కోవర్టు ఆపరేషన్లకు, సమాచార తస్కరణకు దీనిని ఉపయోగించే అవకాశం ఉంది. 97శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్తోపాటు రోజుకు 10 ట్రిలియన్ డాలర్లు విలువైన లావాదేవీలు ఈ అండర్ వాటర్ కేబుల్స్పై ఆధారపడి ఉన్నాయి.
అణుటార్పిడోల మోహరింపు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణించిన అణు టార్పిడోలను అమర్చేందుకు వీలుగా ఆస్కార్-2క్లాస్ సబ్మెరైన్ పొడవును 100 అడుగులకు పెంచారు. ఈ సబ్మెరైన్లో ఒక్కోటి 79 అడుగుల పొడవైన ఎనిమిది పొసైడన్ అణు టార్పిడోలు ఉంటాయి. ఈ టార్పిడోలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి. ఇవి గంటకు 70 నాట్స్ నుంచి 125 నాట్స్ వేగంతో పనిచేస్తుంటాయి.
ఈ ఆయుధాన్ని రష్యా ప్రతిదాడికి మాత్రమే వినియోగిస్తుంది. పొసైడన్ను తీర ప్రాంతంలోని లక్ష్యాలపై దాడికి వినియోగిస్తారు. ఇవి ఆయా లక్ష్యాల సమీపంలోకి వెళ్లి అణుపేలుడు జరుపుతాయి. దీనిలో కనీసం 2 టన్నుల కోబాల్ట్ వార్హెడ్ అమర్చినా.. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు నీరు కలుషితమైపోతుంది. ఫలితంగా రేడియో యాక్టివ్ పదార్థాలు కలిసిన భారీ నీటి అలలు సునామీ వలే ఆ లక్ష్యాలపై పడతాయి. దీనిని తీర ప్రాంతంలో రద్దీగా ఉండే నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, సముద్రంలోని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తారు.
2015 రష్యా టీవీలో పొసైడాన్కు సంబంధించిన సమాచారం అనుకోకుండా లీకైంది. వాస్తవానికి రష్యానే కావాలని అమెరికాను హెచ్చరించేందుకు సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆ తర్వాత సీఐఏ నిర్ధారించింది. పొసైడాన్ రకం ఆయుధాల్లో పలు వేరియంట్లు ఉన్నాయని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. కొన్ని అండర్వాటర్ డ్రోన్లు కాగా.. మరికొన్ని తీర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలుగా భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు