బ్రేకింగ్

breaking
21 Jan 2022 | 15:42 IST

Stock Market: వారాంతంలోనూ నష్టాలే

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతాలోనూ నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 427 పాయింట్లు కుంగి 59,037 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,674 వద్ద స్థిర పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.45గా ఉంది. మారుతీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కొటక్‌ బ్యాంకు,  ఐసీఐసీఐ, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభాలను ఆర్జించగా.. ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

మరిన్ని

తాజా వార్తలు