కన్నౌజ్ పోరు.. ‘అత్తరు’ గుబాళింపు ఎటువైపో ?
మే 13న జరిగే పోలింగ్లో కన్నౌజ్ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లో కీలక పార్లమెంటు స్థానాల్లో కన్నౌజ్ ఒకటి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, సిటింగ్ ఎంపీ సుబ్రత్ పాఠక్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లలో స్వల్ప తేడానే ఉండడంతో ఈసారి (Lok Sabha Elections) కూడా గట్టి పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ‘అత్తరు’ తయారీకి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బంగాళదుంప రైతులు కూడా ఎక్కువే. నేతలు తమ సమస్యలు వినకపోతారా? అని స్థానిక ఓటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్లో కన్నౌజ్ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
హామీలు నెరవేర్చాలని..
‘సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అత్తరు తయారీదారులు ఉపయోగించే ముడి సరకులపై పన్ను రాయితీ కల్పించారు. కానీ, భాజపా ప్రభుత్వం జీఎస్టీ పేరుతో 18శాతం పన్ను వసూలు చేస్తోంది. పర్ఫ్యూమ్ యూనిట్ల ఏర్పాటులో రాయితీ ఇవ్వడంతోపాటు చిన్న వ్యాపారస్తులకు ఈ పార్కులో అవకాశం కల్పించాలి’ అని సంబంధిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధి జరగలేదని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’.. లోక్సభ అభ్యర్థి వ్యాఖ్యలతో షాకైన జనం
‘స్థానికంగా బంగాళదుంప ఎక్కువగా పండుతుంది. అవి వృథా కాకుండా ఉండేందుకు పరిశ్రమలు ఏర్పాటుచేయాలని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశంపై గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చినప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తమ దగ్గర 200 కోల్డ్ స్టోరేజీలు ఉన్నప్పటికీ దిగుబడి ఎక్కువైన సందర్భాల్లో పంటను పారబోయాల్సి వస్తోంది. గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు చిప్స్, స్టార్చ్ ఫ్యాక్టరీలు నెలకొల్పాలి’ అని స్థానిక రైతులు డిమాండు చేస్తున్నారు.
అఖిలేశ్ ఆశలు..
1967 దశకంలో ప్రముఖ సామాజికవేత్త రామ్మనోహర్ లోహియా గెలిచిన కన్నౌజ్ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ గతంలో మూడుసార్లు విజయం సాధించారు. 2000, 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన యాదవ్.. 2012లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈ స్థానాన్ని వీడారు. ఆ ఉప ఎన్నికల్లో ఆయన భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లోనూ ఆమె విజయం సాధించినప్పటికీ.. 2019లో భాజపా అభ్యర్థి సుబ్రత్ పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఈసారి డింపుల్ మైన్పురి బరిలో నిలవగా.. అఖిలేశ్ కన్నౌజ్లో పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థి పాఠక్ గట్టి పోటీ ఇస్తున్నారు.
కన్నౌజ్ నియోజకవర్గంలో మొత్తం 19 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 3 లక్షల మంది ముస్లింలు ఉన్నట్లు అంచనా. బ్రాహ్మణులు, యాదవ్లు 2.5 లక్షల చొప్పున ఉండగా.. మరో 4 లక్షలకు పైగా దళితులు ఉన్నారు. గతంలో ఎంపీగా స్థానికంగా చేసిన పనులను ఎస్పీ అధినేత అఖిలేశ్ వివరిస్తుండగా.. భాజపా నేత పాఠక్ మాత్రం రాష్ట్రంలో, కేంద్రంలో తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక