బ్రేకింగ్

breaking
21 May 2022 | 19:02 IST

పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

దిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు తీపికబురు. గ్యాస్‌ సిలిండర్‌పై ₹200 రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. అలాగే చమురుపై సెంట్ర‌ల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాజా ధరల తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50లు, డీజిల్‌పై రూ.7తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని

తాజా వార్తలు