మలివిడతకు వేళాయె.. 88 స్థానాల్లో నేడే పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో మలి విడతకు రంగం సిద్ధమైంది. ఎండలు ఠారెత్తిస్తున్నవేళ- రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మలి విడతకు రంగం సిద్ధమైంది. ఎండలు ఠారెత్తిస్తున్నవేళ- రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిజానికి ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సింది. మధ్యప్రదేశ్లోని బైతూల్లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్మరణంతో.. అక్కడ ఓటింగ్ను మూడో దశకు మార్చారు. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాల్లోనూ శుక్రవారమే ఓటింగ్ పూర్తికానుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తదితర ప్రముఖులు ఈ దశలోనే బరిలో ఉన్నారు.
యూపీలో త్రిముఖ పోటీ
ఉత్తర్ప్రదేశ్లో రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తంగా 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపుగా అన్నిచోట్లా ఎన్డీయే, ఇండియా, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. ముకేశ్ ధన్గర్ (కాంగ్రెస్) ఆమెకు ప్రధాన ప్రత్యర్థి. 2009 నుంచి మేరఠ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర అగర్వాల్ స్థానంలో.. అరుణ్ గోవిల్కు భాజపా ఈ దఫా టికెట్ ఇచ్చింది. ఆయనకు ఇవే తొలి ఎన్నికలు. రాజస్థాన్లో బాడ్మేడ్-జైసల్మేర్, జోధ్పుర్, కోటా-బూందీ, చిథోర్గఢ్, టోక్-సవాయి మాధోపుర్, అజ్మేర్ సహా 13 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వాటిలో 152 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాల కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (కోటా-బూందీ), కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (జోధ్పుర్) ప్రయత్నిస్తున్నారు. ఈ విడతతో రాజస్థాన్లో ఓటింగ్ పూర్తికానుంది. రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 25 కాగా, 12 స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ ముగిసింది.
బరిలో బఘేల్
ఛత్తీస్గఢ్లో మూడు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 30 ఏళ్లుగా భాజపాకు కంచుకోటగా ఉన్న రాజ్నంద్గావ్ స్థానంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్ బఘేల్ బరిలో దిగారు. అక్కడ కమలదళం సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ కుమారుడు. మధ్యప్రదేశ్లోని టీకమ్గఢ్లో వీరేంద్రకుమార్ ఖటీక్ నాలుగో విజయంపై కన్నేశారు. అక్కడ కాంగ్రెస్ కొత్త అభ్యర్థి పంకజ్ అహిర్వార్ను బరిలో దింపింది. అస్సాంలో కరీమ్గంజ్, సిల్చార్ (ఎస్సీ), దిఫు (ఎస్టీ), నగావ్, దరాంగ్-ఉదల్గురి స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 61 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బిహార్లో ముస్లింలు మెజార్టీ వర్గంగా ఉన్న కిషన్గంజ్ స్థానంతోపాటు పూర్ణియా, కటిహార్, భాగల్పుర్, బాంకా నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది.
రెండో విడతలోని 88 నియోజకవర్గాల్లో.. 2019లో 52 స్థానాలను భాజపా, 12 సీట్లను ప్రస్తుత దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలు నాడు వీటిలో 23 నియోజకవర్గాలను దక్కించుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ