బ్రేకింగ్

breaking
04 Jun 2023 | 11:22 IST

ఒడిశా రైలు ప్రమాదానికి కారణమదే: అశ్వినీ వైష్ణవ్‌

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  తెలిపారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని కనిపెట్టారన్నారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మరిన్ని

తాజా వార్తలు