బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 19:52 IST

రుణమాఫీ కోసం యుద్ధం చేద్దాం: కేసీఆర్‌

సంగారెడ్డి: డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆగస్టు 15కి వాయిదా వేసిందని భారాస అధినేత కేసీఆర్‌ విమర్శించారు. రుణమాఫీ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ‘భారాస ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన మాట్లాడారు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే  దెబ్బతిన్నామని, బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. రుణమాఫీ, వరికి బోనస్‌ కోసం పోస్టుకార్డు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదని, ముఖ్యమంత్రి వెళ్లి.. భాజపాలో కలిసేలా ఉన్నారని విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు