బ్రేకింగ్

breaking
08 May 2024 | 13:43 IST

త్వరలో కాంగ్రెస్‌లోకి 25 మంది భారాస ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: 25 మంది భారాస ఎమ్మెల్యేలు జూన్‌ 5న కాంగ్రెస్‌లో చేరతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘నాకు పదవులపై ఆశ లేదు.. వచ్చే పదేళ్లు రేవంత్‌ రెడ్డే సీఎం. త్వరలో భారాస దుకాణం ఖాళీ అవుతుంది. ఆరుగురు భారాస ఎంపీ అభ్యర్థులు నన్ను సంప్రదించారు. భారాస ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తోంది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని